Begin typing your search above and press return to search.

టిక్ టాక్ ఆంటీ..జీవితం చివరికిలా బలైంది

By:  Tupaki Desk   |   5 April 2020 11:30 PM GMT
టిక్ టాక్ ఆంటీ..జీవితం చివరికిలా బలైంది
X
మొగుడు కొనిచ్చిన ఫోన్ ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. టిక్ టాక్ ఆమెను బానిసను చేసింది.. పాపులర్ చేసింది. దాంతో పరిచయాలు పెరిగాయి.. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా.. వివాహేతర సంబంధానికి దారితీసింది.ఆ విషయం మొగుడికి తెలిసి అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ విషాదం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

కాడాంబులియార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతానికే చెందిన యువతిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురానికి 7 ఏళ్లు.. ఇద్దరు పిల్లలు కలిగారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో టిక్ టాక్ నిప్పులు పోసింది.

కారు డ్రైవర్ గా పనిచేసే భర్త కిరాయిల పేరిట రోజులకు రోజులు బయటకు వెళ్లేవాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న భార్యకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. దాంతో కాలక్షేపం చేస్తున్న భార్యకు టిక్ టాక్ దొరికింది. భర్త డ్యూటీకి వెళితే ఆమె టిక్ టాక్లో వీడియోలు చేస్తూ కాలక్షేపం చేసేది. టిక్ టాక్ లో పరిచయమైన యువకులతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేసింది.

ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెను పాపులర్ చేశాయి. ఈ విషయం భర్త తోటి డ్రైవర్ లకు తెలిసింది. వాళ్లు నీ భార్యనే అంటూ చూపించడంతో అవమానం తట్టుకోలేకపోయాడు. ఇల్లు మార్చాడు. బుద్ది మార్చుకోమని హెచ్చరించాడు.

ఇక కొత్త ఇంటికి మారినా ఆ భార్య మురుగన్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజు రాత్రి డ్యూటీ ముగించుకొని వచ్చిన భర్తకు భార్య నగ్నంగా వేరే వ్యక్తితో రాసలీలలు చేస్తూ బెడ్ రూంలో అడ్డంగా దొరికింది. కోపం కట్టలు తెంచుకున్న భర్త కారు జాకీ తీసుకొని వారిపై దాడి చేశాడు. రాసలీలలు చేస్తున్న వ్యక్తి తప్పించుకోగా.. రాజేశ్వరి ఈ దాడిలో చనిపోయింది. ఇలా టిక్ టాక్ మోజు చివరకు ఓ మహిళ ప్రాణం తీసింది.