Begin typing your search above and press return to search.

కోహ్లీపై చర్యలు తీసుకోండి.. అంపైర్​తో ఆ గొడవేంటి?

By:  Tupaki Desk   |   17 Feb 2021 5:06 PM IST
కోహ్లీపై చర్యలు తీసుకోండి..  అంపైర్​తో ఆ గొడవేంటి?
X
టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్​ మాజీ క్రికెటర్​ డేవిడ్​ లాయిడ్​ పేర్కొన్నారు. వేరే ఆటలో ఇటువంటి చర్యలకు దిగితే బయటకు పంపిస్తారని చెప్పారు. క్రికెట్​లో అంపైర్​ నిర్ణయమే ఫైనల్ అని క్రీడాకారులు దాన్ని గౌరవించాలని సూచించారు. విరాట్​ కోహ్లీని అహ్మదాబాద్​లో జరిగే డై అండ్​ నైట్​ మ్యాచ్​లో ఆడకుండా నిషేధించాలని డిమాండ్​ చేశారు.

విరాట్ కోహ్లీ ప్రవర్తనకు రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం వీడేలా చేసేవారని తెలిపాడు. కోహ్లీ పదే పదే నిబంధనలు ఉల్లంఘించినా రిఫరీ పట్టించుకోవడం లేదు. అంటే రిఫరీ మ్యాచ్ చూడకుండా ఏసీ గదిలో నిద్రపోతూ ఉన్నాడేమో అంటూ ఘాటుగా లాయిడ్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కోహ్లీ చేసిన తప్పేంటి?

సెకండ్​ టెస్ట్​ మ్యాచ్​లో మూడోరోజు చివరి సెషన్​లో టీంఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. అంపై నితిన్​ మీనన్​తో గొడవకు దిగాడు.

ఆ సెషన్​లో అక్షర్​ పటేల్​ వేసిన బౌలింగ్​లో జో రూట్​ ఎల్బీడబ్ల్యూ కోసం భారత జట్టు అప్పీల్​ చేసింది. బంతి రూట్​ ప్యాడ్​కు వెనుక భాగంలో తగిలింది. ఆ తర్వాత కీపర్​ రిషభ్​ పంత్​ క్యాచ్​ పట్టాడు.

ఫీల్డర్ అంపైర్​ నితిన్​ మీనన్ మాత్రం​ నాటౌట్​గా ఇచ్చాడు. దీంతో టీమిండియా రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి బ్యాట్​కు తగలలేదు కానీ ఆఫ్​ స్టంప్స్​కు తాకినట్లు చూపించింది. దాంతో టీవీ అంపైర్ కూడా ఫీల్డర్​ అంపైర్​ నిర్ణయాన్నే సమర్థించాడు.

అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి రవిశాస్త్రి మాత్రం ఓట్​ అయినట్టు సైగలు చేశాడు. దీంతో విరాట్​ కోహ్లీ .. అంపైర్​ నితిన్​ మీనన్​పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో ఆయన మీదకు దూసుకెళ్లాడు. ఈ చర్య తీవ్ర వివాదాస్పదం అయ్యింది.

అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్​ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినా.. అంపైర్​ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తప్పిదమే. ఈ నేపథ్యంలోనే విరాట్‌పై చర్యలు తీసుకోవాలని డేవిడ్ లాయిడ్ అంటున్నాడు.