Begin typing your search above and press return to search.

కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   30 July 2020 12:10 PM GMT
కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే..ఎందుకంటే ?
X
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పట్టుబడ్డ పేకాట శిబిరానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. తాను పేకాట ఆడిస్తున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , ఓ మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఆరోపణలు చేస్తున్నారని బాధపడింది. అసలు పేకాట ఆడిన ప్రాంతం తన నియోజకవర్గం పరిధిలోకి రాదని ఆమె వివరించారు. అలాగే , పేకాట రాయుళ్లని వదిలేయాలని తాను ఎవరికీ చెప్పలేదని.. పేకాట రాయుళ్ల విషయంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలని కోరారు.

దీనిపై ఇప్పటికే తాను ఎస్పీ, ఐజీని కలిసి ఫిర్యాదు చేశానని చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి, దీనిపై డీజీపీ కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ ఘటనలో దొరికిన వారిని విడిపించేందుకు తాను పోలీసులపై ఒత్తిడి చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు.

ఇకపోతే , ఈ నెల 27న నంబూరులో పేకాట శిబిరం నిర్వహిస్తూ పట్టుబడ్డా సురేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనితో అతని వెనక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారని, నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా ఆ పేకాట శిబిరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.