Begin typing your search above and press return to search.
అడుగడుగునా నిర్లక్ష్యం .. తప్పంతా ఆ ఆస్పత్రిదే !
By: Tupaki Desk | 26 Aug 2020 2:00 PM ISTవిజయవాడ స్వర్ణప్యాలెస్ లో నిర్వహిస్తున్న కరోనా కేర్ సెంటర్ లో ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం జరిగి 10 మంది అమాయకులు ప్రాణాలొదిలారు. అగ్నిప్రమాదంలో 10మంది కరోనా రోగులు మరణించిన ఘటనతో తమకేమీ సంబంధం లేదన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విజయవాడ కోర్టు తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.
ఇదే సమయంలో కరోనా కేర్ సెంటర్గా స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను వాడుకుంటామని జిల్లా వైద్యాధికారి కి లేఖ రాసింది..ఆస్పత్రేనని గుర్తు చేసింది. హోటల్ తో ఒప్పందం చేసుకునేటప్పుడే దానికి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత రమేష్ ఆస్పత్రిదేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఘటన జరిగిన తరువాత తమకి సంబంధం లేదు అంటే ఎలా అవుతుంది అని ప్రశ్నించింది. అలాగే ,ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు, రికార్డులను తారుమారు చేయడంతోపాటు దర్యాప్తులో జోక్యం చేసుకుంటారంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ కొడాలి రాజగోపాల్రావు, జీఎం డాక్టర్ కూరపాటి సుదర్శన్, పీఆర్వో పి.వెంకటేష్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్వర్ణ ప్యాలెస్ కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్ తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. ఆ హోటల్ లో అగ్నిమాపక, ఫైర్ అలారమ్ పరికరాలు కూడా లేవు. కోవిడ్ కేంద్రం రోజువారీ నిర్వహణ చూసుకునే రమేష్ ఆస్పత్రికి ఈ పరికరాలు లేవన్న విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. దాన్ని లీజు కు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్ లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది అని చెప్పింది. అగ్నిప్రమాదం జరిగితే ప్రాణహాని ఉంటుందన్న విషయం కూడా ఆస్పత్రి యాజమాన్యానికి తెలుసు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. అన్నీ తెలిసే స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ కేంద్రాన్ని తెరిచారని పూర్తి భాద్యత రమేష్ హాస్పిటల్ దే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం సమంజసమే అని కోర్టు వెల్లడించింది.
ఇదే సమయంలో కరోనా కేర్ సెంటర్గా స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను వాడుకుంటామని జిల్లా వైద్యాధికారి కి లేఖ రాసింది..ఆస్పత్రేనని గుర్తు చేసింది. హోటల్ తో ఒప్పందం చేసుకునేటప్పుడే దానికి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత రమేష్ ఆస్పత్రిదేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఘటన జరిగిన తరువాత తమకి సంబంధం లేదు అంటే ఎలా అవుతుంది అని ప్రశ్నించింది. అలాగే ,ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు, రికార్డులను తారుమారు చేయడంతోపాటు దర్యాప్తులో జోక్యం చేసుకుంటారంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ కొడాలి రాజగోపాల్రావు, జీఎం డాక్టర్ కూరపాటి సుదర్శన్, పీఆర్వో పి.వెంకటేష్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు విజయవాడ ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్వర్ణ ప్యాలెస్ కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్ తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. ఆ హోటల్ లో అగ్నిమాపక, ఫైర్ అలారమ్ పరికరాలు కూడా లేవు. కోవిడ్ కేంద్రం రోజువారీ నిర్వహణ చూసుకునే రమేష్ ఆస్పత్రికి ఈ పరికరాలు లేవన్న విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. దాన్ని లీజు కు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్ లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది అని చెప్పింది. అగ్నిప్రమాదం జరిగితే ప్రాణహాని ఉంటుందన్న విషయం కూడా ఆస్పత్రి యాజమాన్యానికి తెలుసు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. అన్నీ తెలిసే స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ కేంద్రాన్ని తెరిచారని పూర్తి భాద్యత రమేష్ హాస్పిటల్ దే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం సమంజసమే అని కోర్టు వెల్లడించింది.
