Begin typing your search above and press return to search.

నా చావుకు దెయ్యమే కారణం..విద్యార్థిని సూసైడ్ నోట్

By:  Tupaki Desk   |   20 July 2020 12:30 AM GMT
నా చావుకు దెయ్యమే కారణం..విద్యార్థిని సూసైడ్ నోట్
X
ఓ దెయ్యం నర్సింగ్ విద్యార్థిని చంపేసిందట.. చనిపోయేందుకు రావాలని ప్రతీరోజు పిలిచేదట.. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే వారిని చంపేస్తానని భయపెట్టిందట.. అందుకే ఆత్మహత్య చేసుకొని ఆ దెయ్యం వద్దకే వెళ్లిపోయింది ఓ నర్సింగ్ విద్యార్థిని. ఈ దారుణం తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన యువతి కోయంబత్తూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది.

లాక్ డౌన్ కారణంగా కాలేజీ లేకపోవడంతో మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. ఇటీవలే పుట్టిన రోజు జరుపుకుంది.అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు.

శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె గదిని తనిఖీ చేసిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. నాకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని.. చనిపోయేందుకు రావాలని ఓ దెయ్యం పిలుస్తోందని.. అందుకే చనిపోతున్నానని రాసుకుంది.

దీంతో మిస్టరీగా మారిన ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.