Begin typing your search above and press return to search.

హీరో రామ్ ట్వీట్ పై విజయవాడ సీపీ సీరియస్

By:  Tupaki Desk   |   20 Aug 2020 2:42 PM GMT
హీరో రామ్ ట్వీట్ పై విజయవాడ సీపీ సీరియస్
X
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై మరోసారి విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసరావు స్పందించారు. రమేశ్ హాస్పిటల్ అగ్నిప్రమాదం కేసులో అనుమానితులు, ముద్దాయిలు విచారణకు సహకరించడం లేదని సీపీ బత్తిన పేర్కొన్నారు. నిందితుల కోసం హైదరాబాద్ తోపాటు చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపినట్లు చెప్పారు. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ఇస్తామని కమిషనర్ ప్రకటించారు.

మరోవైపు హీరో రామ్ ట్వీట్ పై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు ఎలా చేయాలో తమకు తెలుసునని.. పోలీసులకు రాజకీయ పార్టీలు, మతాలు ఉండవని స్పష్టం చేశారు.

విచారణ విషయంలో మేం ప్రొఫెషినల్స్ అని కామెంట్ చేసిన సీపీ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో అనుమానితులు, ముద్దాయిలు విచారణకు సహకరించటం లేదని ప్రశ్నించారు.

రమేశ్ ఆసుపత్రి, హోటల్ మధ్య ఎంవోయూ ఉందని తొలుత చెప్పారు. ఇంత వరకు ఆ ఎంవోయూ పోలీసులకు అందివ్వలేదని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం సహకరించాలని కోరుతున్నామన్నారు. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు.