Begin typing your search above and press return to search.

కొడుకు దారుణం.. ఆస్తికోసం తల్లి నగ్నచిత్రాలతో బ్లాక్ మెయిల్

By:  Tupaki Desk   |   20 May 2020 11:30 PM GMT
కొడుకు దారుణం.. ఆస్తికోసం తల్లి నగ్నచిత్రాలతో బ్లాక్ మెయిల్
X
ఆస్తి కోసం కన్నతల్లి మానాన్నే నడిబజారులో పెట్టిన కసాయి కొడుకు ఉదంతం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటిపత్రాలను తనకు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన సదురు కొడుకు వృద్ధురాలైన తల్లి నగ్న చిత్రాలను వారి బంధువులకు వాట్సాప్ లో షేర్ చేసి అవమానించాడు. ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.

75 ఏళ్ల మహిళ భర్త 20 రోజుల క్రితం చనిపోయాడు. దీంతో కొడుకుకు తండ్రి ఆస్తిపై ఆశ కలిగింది. తల్లిని ఆస్తి పత్రాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. దీంతో కోపం పెంచుకున్నాడు. 75 ఏళ్ల మహిళపై మే 13న ఆమె కొడుకు వచ్చి ఏదో ఒక పదార్థం స్ప్రే చేశఆడు. దీంతో ఆమె ఒళ్లంతా దురద లేచింది. దీంతో బట్టలు తీసి స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్లింది.

ఆమె కుమారుడు తల్లి స్నానం చేస్తున్న సమయంలో ఫొటోలను రహస్యంగా క్లిక్ చేసి సోషల్ మీడియాలో వారి బంధువులకు పంపించాడు.

ఈ సంఘటనపై బంధువులు ఆ తల్లికి విషయం వివరించారు. దీంతో ఆ మహిళ మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తల్లి నగ్న చిత్రాలు షేర్ చేసిన కొడుకు దీపక్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పరువు తీయాలనే ఈ పనిచేసినట్టు కొడుకు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.