Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   28 Oct 2020 11:20 PM IST
బ్రేకింగ్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
X
కరోనా ఎవ్వరిని వదలడం లేదు. దేశవ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది. దేశంలో రోజురోజుకు కేసులు తగ్గుతున్నా విస్తృతి మాత్రం పెరుగుతూనే ఉంది. . కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరికీ సోకుతోంది.

తాజాగా కేంద్రమంత్రులపై కరోనా దాడి చేస్తోంది. జనంలోకి మంత్రులు వస్తుండడంతో వారికి వ్యాపిస్తోంది. అభివృద్ది, ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుడడంతో విస్తరిస్తోంది. తాజాగా కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా పాజిటివ్ పడ్డారు.

తాజాగా పరీక్షలు చేయించుకున్న స్మృతి ఇరానీకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించారు. తనకు ఎలాంటి సమస్యలు లేవని.. ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ ఎన్డీయే తరుఫున పలు బహిరంగ సభల్లో చరుగ్గా పాల్గొన్నారు. ప్రచార పర్వంలో నేతలతో మమేకమయ్యారు. సభల్లో ప్రసంగించారు. దీంతో స్మృతికి కరోనా సోకింది.

ఇప్పటికే హోంమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు చాలా మంది కరోనా బారిన పడగా.. తాజాగా స్మృతి కూడా వైరస్ బారినపడ్డారు.