Begin typing your search above and press return to search.

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్న స్మిత

By:  Tupaki Desk   |   20 April 2021 1:30 PM GMT
ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్న స్మిత
X
నాటు పాటలతో టాలీవుడ్ లో పాప్ సింగర్ గా ఎదిగిన సింగర్ స్మిత తాజాగా ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ రేపారు. పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని స్మిత తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్మిత అనంతరం మరో ట్వీట్ లో 'ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి' అంటూ ట్వీట్ చేయడం సంచలనమైంది. అది ఎవరిని ఉద్దేశించి అన్నది ఆమె పేర్కొనకపోవడంతో నెటిజన్లు తమకు తోచింది అన్వయించుకుంటున్నారు.

చంద్రబాబు బర్త్ డే సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా విభాగంతోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు బర్త్ డే ను 'ఫోర్ ట్వంటీ' అని పేర్కొంటూ రెండు హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తోంది. బహుశా వారికి కౌంటర్ గా స్మిత ఈ కామెంట్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.

అయితే దీనిపై అందరూ కామెంట్ చేయడంతో తాను ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని.. ఎందుకో ఎప్పుడూ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇదే భావన తనకు కలుగుతుందని స్మిత మరో ట్వీట్ చేసింది. తాను పెట్టిన ట్వీట్ కు అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నాయని.. భవిష్యత్ లోనైనా బూతు పదాలు రావద్దని ఆమె ట్వీట్ చేశారు.

ఇక స్మితకు అనుకూలంగా ఒక పార్టీవారు.. వ్యతిరేకంగా మరో పార్టీ వారు కామెంట్స్ చేస్తూ ఆమె ట్వీట్ పై చర్చ కొనసాగిస్తున్నారు.బహుశా దీనికి కౌంటర్ గానే స్మిత ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.