Begin typing your search above and press return to search.

షాకింగ్.. క‌ర్నూలు జిల్లా లో బాలుడి పై అత్యాచారం! వీడియో తీశారు..

By:  Tupaki Desk   |   30 Jan 2020 7:57 AM GMT
షాకింగ్.. క‌ర్నూలు జిల్లా లో బాలుడి పై అత్యాచారం! వీడియో తీశారు..
X
క‌ర్నూలు జిల్లా అవుకులో తెలుగుదేశం పార్టీ మండ‌ల కార్యాల‌యంలో దారుణం చోటు చేసుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక ప‌ద్నాలుగేళ్ల బాలుడిపై తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు న‌లుగురు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌ కు సంబంధించి వీడియో ను కూడా వారే తీసిన‌ట్టు గా స‌మాచారం. ఆ వీడియో బ‌య‌ట‌ కు రావ‌డం తో అస‌లు క‌థ లేటుగా వెలుగు చూసింది.

బాలుడి పై అత్యాచారానికి పాల్ప‌డిన తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల పేర్లు.. బుల్లెట్ రాజు,రాజు, ప్రేమ్ కుమార్ అని స‌మాచారం. వీరితో పాటు మ‌రొక‌రి మీద ఫోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసులు న‌మోదు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాలుడి మీద ప‌డి.. వీరు లైంగిక వాంఛ తీర్చుకోవ‌డాన్ని వీడియో గా తీసుకున్నారు. విక‌ట్ట‌హాసాలు చేస్తూ పిల్లాడి మీద వారు దారుణానికి ఒడిక‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

అమ్మాయిల‌కే కాకుండా.. అబ్బాయిల‌కు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింది స‌మాచారం. ప‌సి పిల్లల‌పై ఇలాంటి అఘాయిత్యాలు జ‌ర‌గ‌డం, అది ఒక రాజ‌కీయ పార్టీ మండ‌ల స్థాయి కార్యాల‌యంలో జ‌రిగిన‌ట్టు గా వార్త‌లు వ‌స్తూ ఉండ‌టం దారుణం. చేసిన ఘాతుకాన్ని అంత ధైర్యంగా వీడియోలు తీశారంటే..వీరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.