Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నందుకు హత్య..కారులోనే అత్యాచారం!

By:  Tupaki Desk   |   6 April 2020 6:30 PM GMT
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నందుకు హత్య..కారులోనే అత్యాచారం!
X
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద గత నెల 17న లభ్యమైన వివాహిత మృతదేహానికి సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘాతుకం చేసింది ఇద్దరు యువకులే అని పోలిసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడం తో పథకం ప్రకారమే ఆమెను హత్యచేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిజాలు కనుగొనే పనిలో ఉన్నారు. అలాగే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కూడా కొన్ని బృందాలు గాలిస్తున్నాయి.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ..ఈ హత్యకు గురైన మహిళకు వివాహమైంది. అయితే, పెళ్లికి ముందు నుంచే ప్రధాన నిందితుడి తో ఆమె ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఈ క్రమంలో పెళ్లి అయిన కూడా , ప్రియుడితో వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నది. ఇదే విషయంలోకి పదే పదే ఒత్తిడి చేసింది. అయితే, ఇదే సమయంలో వేరే అమ్మాయికి దగ్గరైన నిందితుడు వివాహితను దూరం పెట్టాడు. అయినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే ... లాంగ్‌ డ్రైవ్‌ కు వెళ్దామని బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. ప్రియుడు బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరొక వ్యక్తి బలాత్కారం చేశాడు. మట్టుబెట్టాలనే ఉద్దేశ్యం తో గొంతు నులిమి హత్య చేశారు. మహిళ దుస్తులు తీసేసి మృతదేహాన్ని ఫ్లై ఓవర్ కిందకు తెచ్చారు. గంట పాటు అక్కడే ఉండి తలను ఛిద్రం చేశారు. ఆ తరువాత ఆ రాయిని కూడా తమతో పాటే తీసుకుపోయారు. ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌చేంజ్ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదికి చేరుకున్నారు. ఈ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో కారు జీపీఎస్ కీలకంగా మారింది.