Begin typing your search above and press return to search.

తల్లిని చంపేసిన కీర్తి ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటకు

By:  Tupaki Desk   |   30 Oct 2019 7:34 AM GMT
తల్లిని చంపేసిన కీర్తి ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటకు
X
అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో ప్రేమ ఎపిసోడ్ ను పేరెంట్స్ నో చెప్పారు. తర్వాత సమాధాన పడి ఓకే చేశారు. అంతలోనే మరో బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉండటం.. మొదటోడితో పెళ్లి ఖాయమైన వేళ.. ఇదేం పాడు బుద్ధి అంటూ కూతుర్ని మందలించిన తల్లిని నిర్దాక్షిణ్యంగా చున్నీతో ఉరి వేసి చంపేసి.. రైల్వే ట్రాక్ మీద పడేసిన కుమార్తె కీర్తి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇదేం పని? అన్నందుకు తల్లినే చంపేసిన కీర్తి ఇప్పుడెక్కడ ఉంది? ఎలా ఉంది? పోలీసులకు ఏం చెప్పింది? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే కొత్త విషయాలు బయటకు రావటమే కాదు.. మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

గుట్టుగా చంపేస్తే తాను చేసిన పాపం బయటపడదని అనుకున్న కీర్తి.. ఊహకు.. నిజానికి మధ్య వ్యత్యాసం అర్థమై ఇప్పుడు విపరీతంగా రోదిస్తోంది. తల్లిని చంపేసి తండ్రి మీద ఆ మరక వేసే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయిన ఆమె.. తాను చేసిన పనికి పశ్చాతాపడటం కంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా వేదన చెందుతుందన్న సమాచారం అందుతోంది.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాల్ని బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కీర్తి ముందుగా బాల్ రెడ్డి అనే కుర్రాడ్ని ప్రేమించింది.

ఇరుకుటుంబాలకు తెలిసిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదురైనా.. చివరకు పెళ్లికి ఓకే చెప్పారు. అదే సమయంలో కీర్తి గర్భం దాల్చింది. దీంతో.. ఆ గర్బాన్ని తొలగించుకోవాలనుకున్న ఆమె ఇంటి పక్కనున్న శశి సాయం తీసుకుంది. శశి తనకు వరసకు అన్న అవుతాడంటూ బాల్ రెడ్డికి పరిచయం చేసింది.

ముగ్గురు కలిసి మహబూబ్ నగర్ జిల్లా అమన్ గల్ ప్రాంతానికి వెళ్లి ఒక గదిని అద్దెకు తీసుకొని అబార్షన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న శశి.. తనకు లొంగాలని.. లేదంటే కీర్తి తల్లిదండ్రులకు చెప్పాలని బెదిరించాడు. దీంతో శశికి లొంగిపోయింది కీర్తి. ఆ తర్వాత కాలంలో అతడే ఆమెకు లోకమయ్యాడు.

శశి మైకంలో బాల్ రెడ్డికి బ్రేకప్ చెప్పేందుకు రెఢీ అయ్యింది. అతనితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన కీర్తి తల్లి రజిత.. కుమార్తెను మందలించింది.తాను బాల్ రెడ్డిని పెళ్లాడనని.. శశినే పెళ్లాడతానని తేల్చి చెప్పింది. బాల్ రెడ్డి కన్నా శశి సంపన్నులని.. అతడు బీటెక్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడని.. అందుకే అతడ్నే పెళ్లాడతానని తేల్చి చెప్పింది.

దీనికి తల్లి ఒప్పుకోకపోవటంతో ఈ విషయాన్ని శశికి చెప్పింది. తల్లిని గుట్టుగా చంపేస్తే అడ్డు తొలుగుతుందని భావించి.. తండ్రి ఇంట్లో లేని టైంలో తల్లిని చంపేసింది. అయితే.. అంచనాకు వాస్తవానికి మధ్య తేడా ఆమెకు ఇప్పుడిప్పుడే బోధ పడుతోంది.

దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిన తర్వాత ఎంత ఏడిస్తే ఏం లాభం అన్నట్లుగా కీర్తి ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.