Begin typing your search above and press return to search.

వికారంగా అనిపిస్తుంది కానీ.. ఇలాంటోళ్లు మనచుట్టూ ఉంటారు పారాహుషార్

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:20 PM IST
వికారంగా అనిపిస్తుంది కానీ.. ఇలాంటోళ్లు మనచుట్టూ ఉంటారు పారాహుషార్
X
నిజమే.. విన్నంతనే వికారంగా అనిపిస్తుంది. ఇలాంటివి కూడా చదవాలా? అనుకోవటం సహజం. ఎందుకండి.. ఇలాంటి వార్తలతో మీరు సాధించేదేమిటి? ఇలాంటి కలుషితాన్ని అక్షరాల్లోకి తీసుకొచ్చి.. మా మెదళ్లకు లేని చిరాకును ఎందుకు తీసుకొస్తారు? లాంటి మాటలు చాలామందే చేయొచ్చు. కానీ.. చుట్టూ జరిగే పరిణామాల గురించి తెలుసుకోవటం.. మారుతున్న కాలానికి తగ్గట్లుగా.. మనుషుల్లోని పైశాచికత్వం గురించి తెలుసుకోవటం ద్వారా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. సమాజంలో వస్తున్న మార్పుల్ని రికార్డు చేయకుంటే.. ఇలాంటి వాటికి ఎలా చెక్ చెప్పాలన్న విషయం మీద ఆలోచించేవారెవరు. అసలు ఇలాంటివి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? వారిని అంతలా మార్చేస్తున్న అంశాలేమిటి? అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉంది.

హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురించి విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా వికారంగా మారుతుంది. దిల్ సుఖ్ నగర్ కు దగ్గర్లోని చైతన్యపురి కాలనీ సాగర్ హిల్స్ లో 35 ఏళ్ల నోముల సిద్దిరాజ్ పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని వద్ద రెండు ఆవులు.. మూడు గేదెలు.. రెండు లేగదూడలు ఉన్నాయి. వాటిని ఇంటి బయట కట్టి ఉంచుతాడు. ఇదిలా ఉంటే.. యూపీకి చెందిన సంజయ్ వర్మ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఎల్ బీ నగర్ లో కూలిపని చేస్తుంటాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న ప్రాంతంలో కట్టి ఉన్న లేగదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఆరాచకాన్ని గమనించిన యజమాని.. స్థానికులు ఈ కామాంధుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారి దాడి నుంచి తప్పించుకున్నాడు. ఇతగాడి వ్యవహరింపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు సంజీవ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పు లేదు.