Begin typing your search above and press return to search.

శాడిస్టు బాసు.. కరోనా వచ్చినా లీవ్​ ఇవ్వలే .. బ్యాంకు మేనేజర్​ దుర్మరణం

By:  Tupaki Desk   |   16 Sept 2020 9:00 AM IST
శాడిస్టు బాసు.. కరోనా వచ్చినా లీవ్​ ఇవ్వలే ..  బ్యాంకు మేనేజర్​ దుర్మరణం
X
అతడో శాడిస్ట్​ బాసు.. నిరంతరం తన కింద పనిచేసే ఉద్యోగులను వేపుకు తింటుంటాడు. కరోనా వచ్చిన ఓ ఉద్యోగికి సెలవు మంజూరు చేయలేదు. ఏ మాత్రం దయ లేకుండా అతడి తో పనిచేయించుకున్నాడు. సకాలంలో చికిత్స అందక ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేవ్​ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిపై దేశ వ్యాప్తంగా బ్యాంక్​ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కృష్ణా జిల్లా లక్ష్మి పురం ఎస్​బీఐ బ్రాంచ్ ​లో రాజేశ్​ మేనేజర్​గా పని చేస్తున్నాడు. ఆగస్ట్​ 25 నుంచి అతడు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. అదే బ్యాంక్​ లో ఫీల్డ్​ ఆఫీసర్​ గా పని చేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతడికి రాజేశ్​ సెలవు మంజూరుచేశాడు. తనకు కరోనా లక్షణాలు కనిపించడం తో రాజేశ్​ కూడా సెలవు కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజేశ్​ లీవ్​ రిక్వెస్ట్​ ను రీజినల్​ మేనేజర్​ తిరస్కరించాడు. బ్యాంకులో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నందున లీవ్​ కుదరదని చెప్పాడు. దీంతో రాజేశ్​ అనారోగ్యం తోనే విధులకు హాజరయ్యాడు.

సెప్టెంబర్​ 1న తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. తనకు కరోనా వచ్చిన విషయం ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ వారు లీవ్​ ఇవ్వలేదు. దీంతో రాజేశ్​ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. చికిత్స కోసం అతను కాకినాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో చేరారు. అక్కడినుంచే ఆన్‌లైన్‌లో రివ్యూ మీటింగ్‌లకు హాజరవాలని రీజినల్ మేనేజర్ ఆదేశించారు. దీంతో రాజేష్ ఆస్పత్రి నుంచి కూడా పనిచేశాడు. రివ్యూ మీటింగ్​ లో ఉన్నతాధికారులు వేధించారు ఈ ఒత్తిడి తట్టుకో లేక సెప్టెంబర్​ 11 న రాజేవ్​ మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటన పై బ్యాంకు సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. సదరు ఉన్నతాధికారిని వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.