Begin typing your search above and press return to search.

చెప్పు దెబ్బ‌లు కొట్టిన రౌడీ ఎంపీపై బ్యాన్‌

By:  Tupaki Desk   |   24 March 2017 6:33 AM GMT
చెప్పు దెబ్బ‌లు కొట్టిన రౌడీ ఎంపీపై బ్యాన్‌
X
తాను కోరుకున్న బిజినెస్ క్లాస్ లో ప్ర‌యాణం చేయ‌లేద‌న్న కోపంతో 60 ఏళ్ల వ‌య‌సున్న ఎయిరిండియా ఉద్యోగి శివ‌సేన‌కు చెందిన రౌడీ ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ పై విమానయాన సంస్థ బ్యాన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అనుచితంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌యాణికుల్ని విమానం ఎక్క‌కుండా బ్యాన్ లిస్ట్‌ను ప‌లు అంత‌ర్జాతీయ విమాన‌యాన సంస్థ‌ల సిద్ధం చేస్తుంటాయి. అదే తీరులో ప‌లు ప్రైవేటు విమాన‌యాన సంస్థ‌లు ఇలాంటి జాబితాల్ని త‌యారు చేస్తుంటాయి. అయితే.. భార‌త ప్ర‌భుత్వ విమాన‌యాన సంస్థ తొలిసారి బ్యాన్ లిస్ట్‌ ను స్టార్ట్ చేయ‌ట‌మే కాదు.. దారుణంగా వ్య‌వ‌హ‌రించిన శివ‌సేన ఎంపీపై బ్యాన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఫుణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిరిండియాలో బిజినెస్ క్లాస్ టికెట్ కోర‌గా.. సీట్లు అందుబాటులో లేక‌పోవ‌టంతో ఎకాన‌మీ క్లాస్ టికెట్లు ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌.. ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ పై దాడి చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను 25 చెప్పుదెబ్బ‌లు కొట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఈ దాడిలో ఎయిరిండియా ఉద్యోగి క‌ళ్ల‌జోడు.. చొక్కా చినిగిపోయింది.

తాను ఎయిరిండియా ఉద్యోగిని కొట్టిన విష‌యాన్ని బాహాటంగానే చెప్పిన ఎంపీ.. తాను చేసిన ప‌ని ప‌ట్ల ఏ మాత్రం బాధ‌ను వ్య‌క్తం చేయ‌క‌పోవ‌టంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ఎంపీ చ‌ర్య‌ను ఎయిరిండియా సీరియ‌స్ గా తీసుకుంది. ఆయ‌న‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఈ బ్యాన్ ఎంత కాలం అమ‌ల్లోకి ఉంటుంద‌న్న‌ది వెల్ల‌డి కాలేదు. వివాదాల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కే ఈ రౌడీ ఎంపీపై గ‌తంలోనూ ప‌లు క్రిమిన‌ల్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/