Begin typing your search above and press return to search.
జగన్ కు 5 కోట్లు ఇప్పించిన వైఎస్ ప్రాణమిత్రుడు
By: Tupaki Desk | 5 April 2016 12:41 PM ISTరాజకీయాల్లో గొప్ప నాయకులకు అత్యంత సన్నిహితులుగా మెదిలే వారిని కదిలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. వారు చెప్పే విషయాలు సుదీర్ఘ సమయం తర్వాత అయినప్పటికీ అందులో ఉండే కొత్త పాయింట్ కట్టిపడేస్తుంది. తాజాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన ప్రాణమిత్రుడు, ఆరుసార్లు ఎంపీగా గెలిచి వైఎస్ వల్లే కేంద్ర మంత్రి పదవి చేపట్టిన సాయి ప్రతాప్ ఓ క్రేజీ విషయాన్ని చెప్పుకొచ్చారు. దివంగత వైఎస్ కు, ఆయన తనయుడు వైఎస్ జగన్ కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు.
కొద్దికాలం క్రితం సాయిప్రతాప్ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ ఆర్-జగన్ కు మధ్యనున్న ఆర్థిక సంబంధాలను తెలియజేశారు. ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ ఆర్ వద్దకొచ్చిన తనకు ఐదు కోట్ల రూపాయలు కావాలని అడిగారు. వ్యాపారం చేసుకుంటానని చెప్తూ పెట్టిన ఈ ప్రతిపాదనపై వైఎస్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సాయిప్రతాప్ జగన్ కు డబ్బులు ఇవ్వాల్సిందిగా ప్రోత్సహించారు. కట్ చేస్తే ఆ డబ్బులను వైఎస్ జగన్ పెట్టుబడి పెట్టి మంచి లాభాలు సంపాదించారు. అలా జగన్ లోని వ్యాపార నైపుణ్యం తెరమీదకు వచ్చింది అంటూ సాయిప్రతాప్ వివరించారు.
కొద్దికాలం క్రితం సాయిప్రతాప్ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ ఆర్-జగన్ కు మధ్యనున్న ఆర్థిక సంబంధాలను తెలియజేశారు. ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ ఆర్ వద్దకొచ్చిన తనకు ఐదు కోట్ల రూపాయలు కావాలని అడిగారు. వ్యాపారం చేసుకుంటానని చెప్తూ పెట్టిన ఈ ప్రతిపాదనపై వైఎస్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సాయిప్రతాప్ జగన్ కు డబ్బులు ఇవ్వాల్సిందిగా ప్రోత్సహించారు. కట్ చేస్తే ఆ డబ్బులను వైఎస్ జగన్ పెట్టుబడి పెట్టి మంచి లాభాలు సంపాదించారు. అలా జగన్ లోని వ్యాపార నైపుణ్యం తెరమీదకు వచ్చింది అంటూ సాయిప్రతాప్ వివరించారు.
