Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరనున్న యామిని సాధినేని

By:  Tupaki Desk   |   7 Nov 2019 2:41 PM GMT
బీజేపీలో చేరనున్న యామిని సాధినేని
X
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ లో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో దూకుడుగా వ్యవహరించి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సాధినేని యామిని టీడీపీని వీడడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న యామిని పార్టీ మారుతారని ఇంతకు ముందే ప్రచారం జరిగినా ఆమె రాజీనామా చేయలేదు. ఈసారి మాత్రం బీజేపీ లోకి చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 10న ఆమె జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

కొంత కాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణతో యామిని చర్చలు జరుపుతున్నారని... త్వరలోనే ఆమె బీజేపీలో చేరనుందని గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డ సాదినేని యామిని... ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటును టీడీపీ మరో నేతకు కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. ఎన్నికల తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యం లో... యామిని కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించడంతో యామిని కాస్త మెత్త బడ్డారు. కానీ, మళ్లీ ఆమె బీజేపీ లోకి వెళ్లాలని డిసైడయ్యారు.

బీజేపీ ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. యామిని బీజేపీ లో చేరితో ఆ పార్టీ మంచి గొంతు కాగరనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేశ్‌ కు సన్నిహితురాలిగా పేరున్న యామిని మరి బీజేపీలో చేరితే చంద్రబాబు, లోకేశ్‌ లను ఎంత వరకు విమర్శించ గలరో చూడాలి.