Begin typing your search above and press return to search.
‘ఆస్ట్రేలియా టూర్’ తొలిసారి స్పందించిన సచిన్..!
By: Tupaki Desk | 26 Nov 2020 4:00 AM GMTఆస్ట్రేలియా టూర్కు బీసీసీఐ జట్టు ఎంపికచేసినప్పటి నుంచి సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టడం.. ఫిట్ నెస్ వంకతో రోహిత్ శర్మను ఎంపిక చేయక పోవడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఓ దశలో రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలన్న వాదన బలంగా వినిపించింది. సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పలుమార్లు బీసీసీఐ తీరును తప్పుపట్టారు.
రోహిత్ను టీ20కి కెప్టెన్ చేయాలని ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి తన వాయిస్ను వినిపిస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ లాంటి సీనియర్లు కూడా టీంఇండియా కూర్పును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై ఒక్కసారి కూడా స్పందించని సచిన్ తాజాగా ఓ కామెంట్ చేశాడు. టెస్టుల్లో మయాంక్ను ఓపెనర్ గా తీసుకోవడం మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు ఐపీఎల్ మంచి ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్లను బీసీసీఐ ఎప్పటికీ పక్కనపెట్టదని.. వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుందని కూడా సచిన్ అన్నాడు.
ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో ఆడనున్నది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టెస్టుల్లో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ కరెక్ట్ ఆప్షన్ అని సచిన్ అన్నాడు. అయితే ఎప్పుడు వివాదాస్పద అంశాలు, సున్నితమైన అంశాలపై ఎటువంటి కామెంట్లు చేయరు. సీనియర్ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికచేసిన భారతజట్టు పై విమర్శలు గుప్పించారు. కానీ ఈ విషయంపై సచిన్ స్పందించ లేదు. అయితే తాజాగా మయాంక్ అగర్వాల్ ఎంపిక సరైనదేనంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ల్లో ఆడాలని కూడా సచిన్ ఆకాంక్షించాడు.
రోహిత్ను టీ20కి కెప్టెన్ చేయాలని ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి తన వాయిస్ను వినిపిస్తున్నారు. సంజయ్ మంజ్రేకర్ లాంటి సీనియర్లు కూడా టీంఇండియా కూర్పును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై ఒక్కసారి కూడా స్పందించని సచిన్ తాజాగా ఓ కామెంట్ చేశాడు. టెస్టుల్లో మయాంక్ను ఓపెనర్ గా తీసుకోవడం మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు ఐపీఎల్ మంచి ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్లను బీసీసీఐ ఎప్పటికీ పక్కనపెట్టదని.. వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుందని కూడా సచిన్ అన్నాడు.
ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో ఆడనున్నది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టెస్టుల్లో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ కరెక్ట్ ఆప్షన్ అని సచిన్ అన్నాడు. అయితే ఎప్పుడు వివాదాస్పద అంశాలు, సున్నితమైన అంశాలపై ఎటువంటి కామెంట్లు చేయరు. సీనియర్ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికచేసిన భారతజట్టు పై విమర్శలు గుప్పించారు. కానీ ఈ విషయంపై సచిన్ స్పందించ లేదు. అయితే తాజాగా మయాంక్ అగర్వాల్ ఎంపిక సరైనదేనంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ల్లో ఆడాలని కూడా సచిన్ ఆకాంక్షించాడు.