Begin typing your search above and press return to search.

సచిన్ ను దారుణంగా మోసం చేసిన హైదరాబాదీ

By:  Tupaki Desk   |   25 July 2020 6:00 AM IST
సచిన్ ను దారుణంగా మోసం చేసిన హైదరాబాదీ
X
దేశంలో టాప్ మోస్ట్ సెలెబ్రెటీ.. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నే మోసం చేశాడు ఓ హైదరాబాదీ. వెంచర్ల పేరుతో భూమి పేరిట చెరువు భూములను అంటగట్టి నిలువునా ముంచేశాడని తెలిసింది. సచినే కాదు.. చాలా సినీ సెలెబ్రెటీలు కూడా ఈ హైదరాబాద్ రియల్టర్ చేతిలో మోసపోయారని తెలిసింది.

హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ చేతిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తోపాటు ఆయన భార్య అంజలి, సినీ తారలు నయనతార, రమ్యక్రిష్ణలు కూడా మోసపోయారని వార్తలు వైరల్ అయ్యాయి.

హైదరాబాద్ రావిర్యాల దగ్గరలోని చెరువు భూములను హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ వీరికి విక్రయించాడని.. ఆ 6 ఎకరాల భూమి నిర్మాణాలకు పనికిరాదని ఆ తర్వాత తెలిసినట్టు సమాచారం.వెంచర్లుగా మారుస్తానని తన బావ కోటారెడ్డి.. ఏకంగా సచిన్ సహా సినీ తారలను మోసగించాలని సుధీర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

అయిదే దీనిపై సచిన్ తోపాటు నయనతార, రమ్యక్రిష్ట లాంటి సెలెబ్రెటీలు ఇప్పటివరకు స్పందించలేదు.
Tags: