Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ని ఆ వీడియోలు చూడమన్న రోజా !
By: Tupaki Desk | 21 Dec 2019 12:55 PM GMTఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు శుక్రవారం సాయంత్రం నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ పలు కీలక సూచనలు చేసింది. తాజాగా ఈ రిపోర్ట్ పై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా స్పందించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం జగన్ నిర్ణయంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఓ వ్యూహం ప్రకారం ఈ ప్రకటన చేశారని.. ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ పులివెందుల పంచాయితీలు మొదలవుతాయని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా . .కర్నూలు రాజధానిపై పవన్ కళ్యాణ్ మాట మార్చారని, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని రోజా గుర్తు చేశారు. చంద్రబాబుకు నచ్చినట్లు పవన్ మాటలు మాట్లాడుతూంరని , ముందు రాజధానికి ఎన్ని ఎకరాలుండాలో పవన్ తెలుసుకోవాలని చెప్పారు. లేకుంటే తమ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు వింటే తెలుస్తుంది అని సలహా ఇచ్చారు. అమరావతిలో ఆస్తులు కాపాడుకోవాలని చంద్రబాబు అండ్ కో తాపత్రయ పడుతోందన్నారు.
ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఓ వ్యూహం ప్రకారం ఈ ప్రకటన చేశారని.. ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ పులివెందుల పంచాయితీలు మొదలవుతాయని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా . .కర్నూలు రాజధానిపై పవన్ కళ్యాణ్ మాట మార్చారని, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని రోజా గుర్తు చేశారు. చంద్రబాబుకు నచ్చినట్లు పవన్ మాటలు మాట్లాడుతూంరని , ముందు రాజధానికి ఎన్ని ఎకరాలుండాలో పవన్ తెలుసుకోవాలని చెప్పారు. లేకుంటే తమ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు వింటే తెలుస్తుంది అని సలహా ఇచ్చారు. అమరావతిలో ఆస్తులు కాపాడుకోవాలని చంద్రబాబు అండ్ కో తాపత్రయ పడుతోందన్నారు.