Begin typing your search above and press return to search.

అందరి నోళ్లు మూసి భూకుంభకోణాలు: రోజా

By:  Tupaki Desk   |   29 Jun 2017 4:48 PM IST
అందరి నోళ్లు మూసి భూకుంభకోణాలు: రోజా
X
విశాఖ భూ కుంభకోణం విచారణ పక్కదోవ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. భూ కుంభకోణం జరిగిందంటూ మీడియా ముందు చెప్పిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారని ఆమె ప్రశ్నించారు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన గంటా కూడా సైలెంట్ అయిపోయారని అన్నారు. విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు దీనిపై ఏమీ మాట్లాడకపోయినా కూడా అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తొలుత దీనిపై మాట్లాడినా ఇప్పుడు ఆయన కూడా సైలెంటయిపోయారని ఆమె ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఒత్తిడి చేయించి విష్ణుకుమార్ రాజు నోటికి చంద్రబాబు తాళం వేశారని ఆమె ఆరోపించారు.

అంతేకాదు... విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా కూడా దీనిపై టీడీపీ నేతలు ఎలాంటి స్పందన కనబరచడం లేదని ఆమె అన్నారు. అందరి నోళ్లు మూయించి కుంభకోణాలు సాగిస్తున్నారని రోజా ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/