Begin typing your search above and press return to search.

ధోనీ దంపతులపై పంత్‌ ఆరోపణలు

By:  Tupaki Desk   |   8 March 2019 4:45 AM GMT
ధోనీ దంపతులపై పంత్‌ ఆరోపణలు
X
ప్రస్తుతం టీం ఇండియా జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడుతున్న విషయం తెల్సిందే. వన్డే సిరీస్‌ లో భాగంగా ఇప్పటికే టీం ఇండియా మొదటి రెండు వన్డేలను గెలుచుకుంది. మూడవ వన్డే ధోనీ సొంత గడ్డ అయిన జార్ఖండ్‌ లో జరుగబోతుంది. మూడవ వన్డే కోసం రెండు రోజుల క్రితం టీం ఇండియా జార్ఖండ్‌ చేరింది. జట్టు సభ్యులకు ధోనీ దంపతులు తమ ఫామ్‌ హౌస్‌ లో ప్రత్యేక వింధు ఇచ్చారు. ఆ వింధులు జట్టు సభ్యులందరితో పాటు, ఇంకా పలువురు రాష్ట్రస్థాయి క్రికెటర్స్‌ కూడా పాల్గొన్నారు.

ధోనీ దంపతులు ఇచ్చిన వింధుకు టీం ఇండియా క్రికెటర్లు ఫిదా అయ్యారు. దాదాపు అంతా కూడా ధోనీ ఫామ్‌ హౌస్‌ లో జరిగిన వింధుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. అయితే అందరిలో రిషబ్‌ పంత్‌ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పంత్‌ ట్విట్టర్‌ లో.. వదినగారు మీరు మా ఫిట్‌ నెస్‌ లెవల్స్‌ ను పాడు చేస్తున్నారు, ఇంత రుచికరమైన భోజనం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మీము ఎలా ఫిట్‌ గా ఉంటాం. ఈ సాయంకాలం సమయంలో మాకు చక్కటి వింధు భోజనం అంటూ ట్వీట్‌ చేశాడు.

చాహల్‌ తో పాటు ఇతర జట్టు సభ్యులు చక్కటి వింధుకు కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మొత్తానికి ధోనీ మరోసారి తన తోటి సభ్యులకు అద్బుతమైన వింధును ఏర్పాటు చేసి స్పెషల్‌ అనిపించుకున్నాడు. జట్టు సభ్యులు అంతా కూడా ధోనీ భాయ్‌ అంటూ చక్కని అభిమానంతో పిలుచుకుంటారు. అలాగే ధోనీ భార్య సాక్షిని భాబీ అంటూ సంభోదిస్తారు.