Begin typing your search above and press return to search.
పంత్ ది స్వయంకృతాపరాధం ఇక ఎంట్రీ కష్టమే!
By: Tupaki Desk | 8 Dec 2020 1:19 PM ISTటీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ కెరీర్ చాలా డేంజర్లో ఉందని.. అతడికి ఫ్యూచర్ లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. పంత్ తన క్రికెట్ కెరీర్ను చే జేతులారా నాశనం చేసుకున్నాడని చెప్పాడు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వదిలిపెడితే బాగుపడతాడని.. లేదంటే త్వరలోనే అతడిని బీసీసీఐ పక్కన పెడుతుందన్నాడు. ప్రస్తుతం అతడు టెస్టులకు మాత్రమే ఎంపికయ్యాడని.. భవిష్యత్ లో ఆ అవకాశం కూడా ఉండక పోవచ్చని పేర్కొన్నాడు.
పంత్ వికెట్ కీపర్ గా ధోనీని రీ ప్లేస్ చేస్తాడని అంతా భావించారు. మొదట్లో బ్యాటింగ్ లో కూడా బాగా రాణించాడు. కానీ రాను రాను అతడి ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పంత్ను బీసీసీఐ లైట్ తీసుకుంది. దానికి తోడు కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా లాంటి వికెట్ కీపర్లు బ్యాటింగ్ లో రాణించారు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాలకు కీలకంగా వ్యవహరించారు. దీంతో పంత్ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఈ విషయం పైనే తాజాగా ఆకాశ్చోప్రా స్పందించాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..
‘పంత్ ఇలాగే ఆడితే టెస్టుల్లో కూడా అవకాశం ఉండదు. ఆసీస్- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఇండియా- ఏ తరపున పంత్ స్థానంలో సాహాకు స్థానం లభించిందంటే మనకు విషయం అర్థమై ఉండాలి. ఇప్పటికీ అతడికి అవకాశం ఉంది. తానేంటో నిరూపించుకునేందుకు ఆసిస్ టూర్ కలిసివచ్చింది. ఈ టూర్ లోనైనా రాణిస్తే అతడు తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు. గత ఐపీఎల్ సీజన్ లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. ఒకటి రెండు మ్యాచ్ల్లో తప్ప అతడు మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి పంత్ ఇప్పటికైనా బద్ధకాన్ని వదులుకోవాలి. లేదంటే అతడి కెరీర్ నాశనం అయినట్టే’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
పంత్ వికెట్ కీపర్ గా ధోనీని రీ ప్లేస్ చేస్తాడని అంతా భావించారు. మొదట్లో బ్యాటింగ్ లో కూడా బాగా రాణించాడు. కానీ రాను రాను అతడి ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పంత్ను బీసీసీఐ లైట్ తీసుకుంది. దానికి తోడు కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా లాంటి వికెట్ కీపర్లు బ్యాటింగ్ లో రాణించారు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాలకు కీలకంగా వ్యవహరించారు. దీంతో పంత్ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఈ విషయం పైనే తాజాగా ఆకాశ్చోప్రా స్పందించాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..
‘పంత్ ఇలాగే ఆడితే టెస్టుల్లో కూడా అవకాశం ఉండదు. ఆసీస్- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఇండియా- ఏ తరపున పంత్ స్థానంలో సాహాకు స్థానం లభించిందంటే మనకు విషయం అర్థమై ఉండాలి. ఇప్పటికీ అతడికి అవకాశం ఉంది. తానేంటో నిరూపించుకునేందుకు ఆసిస్ టూర్ కలిసివచ్చింది. ఈ టూర్ లోనైనా రాణిస్తే అతడు తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు. గత ఐపీఎల్ సీజన్ లోనూ పంత్ పెద్దగా రాణించలేదు. ఒకటి రెండు మ్యాచ్ల్లో తప్ప అతడు మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి పంత్ ఇప్పటికైనా బద్ధకాన్ని వదులుకోవాలి. లేదంటే అతడి కెరీర్ నాశనం అయినట్టే’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
