Begin typing your search above and press return to search.

తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న రిషబ్ పంత్.. చివరికిలా

By:  Tupaki Desk   |   30 Dec 2022 12:16 PM GMT
తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న రిషబ్ పంత్.. చివరికిలా
X
కొత్త సంవత్సరానికి ముందు తన తల్లిని ఆశ్చర్యపరిచేందుకు రిషబ్ పంత్ వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్ కారు ఘోర ప్రమాదంగా మారింది. రూర్కీ సమీపంలోని సక్షం హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో పంత్‌కు మొదట చికిత్స చేసిన  డాక్టర్ సుశీల్ నగర్, క్రికెటర్‌కు ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదని, అయితే అతని మోకాలిపై స్నాయువు కొంచెం పక్కకు జరిగిందని దీనికి తదుపరి చికిత్స అవసరమని చెప్పారు.

"అతను మా ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు,  పూర్తిగా స్పృహలో ఉన్నాడు. నేను పంత్ తో మాట్లాడాను. అతను తన తల్లిని ఆశ్చర్యపర్చాలని ఇలా కారులో వస్తున్నానని చెప్పాడు.  ఇంటికి తిరిగి వెళ్తున్నాడు" అని వైద్యుడు మీడియాకు చెప్పారు.
పంత్ వీపుపై పెద్ద గాయాలు అయ్యాయి. కానీ  అవి కాలిన గాయాలు కాదని చెప్పాడు. మంటలు అంటుకున్న వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కారులోంచి దూకడంతో గాయాలు అయ్యాయి. అతని వెనుక రోడ్డు పక్కన దిగగానే చర్మం ఒలిచింది. కానీ అవి కాలిన గాయాలు కాదు. చాలా తీవ్రమైనవి కావు."అని వైద్యుడు తెలిపారు.

25 ఏళ్ల రిషబ్ పంత్ రూర్కీలోని తన ఇంటికి వెళ్లే మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రమత్తులో మెర్సిడెస్‌ కారుపై నియంత్రణ కోల్పోయాడు. కారులో ఒక్కడే ఉన్నాడు.బోల్తా కొట్టడంతో ప్రమాదం బారినపడ్డాడు. హార్దివార్ జిల్లా మంగ్లౌర్ పట్టణంలోని మహ్మద్‌పూర్ జాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతని తల, వీపు , పాదాలకు గాయాలయ్యాయి, కానీ అతని పరిస్థితి నిలకడగా ఉంది. "అతని తలపై రెండు గాయాలు ఉన్నాయి, కానీ నేను కుట్లు వేయలేదు. ప్లాస్టిక్ సర్జన్ అతనిని చూడగలిగే మ్యాక్స్ హాస్పిటల్‌కి నేను అతనిని సిఫార్సు చేసాను" అని వైద్యుడు చెప్పారు.

అయితే, పంత్ కుడి మోకాలిపై స్నాయువు చిరిగిపోయిందని, ఆ గాయం ఎంతవరకు ఉందో ఎంఆర్ఐ స్కాన్ తర్వాత మాత్రమే నిర్ధారించగలమని డాక్టర్ చెప్పారు. " మా ఆసుపత్రిలో నిర్వహించిన ఎక్స్ రేల నివేదికలు ఎముకలకు గాయాలు లేవని సూచిస్తున్నాయి.  అతని కుడి మోకాలిపై లిగమెంట్ గాయం  ఉంది. అది ఎంత తీవ్రంగా ఉందో తదుపరి విచారణ మరియు వివరణాత్మక ఎంఆర్ఐ తర్వాత మాత్రమే గుర్తించవచ్చు," అని వైద్యుడు చెప్పాడు.

స్నాయువు గాయాలు వివిధ గ్రేడ్‌లను కలిగి ఉంటాయి.. పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి 2 నుండి 6 నెలల సమయం పట్టవచ్చు, ఇది ఫిబ్రవరి 9 నుండి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌కు పంత్ దూరం అయినట్టేనని తెలుస్తోంది.

జనవరి 3న శ్రీలంకతో ప్రారంభమయ్యే వైట్-బాల్ సిరీస్‌లో పంత్ కు చోటు దక్కలేదు. ఫిబ్రవరిలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అతను బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్ నెస్ , కండిషనింగ్ ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంది.

ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ అయిన పంత్ ఇప్పటివరకు 33 టెస్టుల్లో ఐదు సెంచరీలు , 11 అర్ధ సెంచరీల సహాయంతో 2,271 పరుగులు చేశాడు. అతను 30 వన్డేలు మరియు 66 టీ20లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.  తాజా గాయంతో పంత్ కెరీర్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.