Begin typing your search above and press return to search.

దేవాదాయ శాఖ రద్దు ?

By:  Tupaki Desk   |   24 Sept 2021 10:00 PM IST
దేవాదాయ శాఖ రద్దు ?
X
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖను రద్దు చేస్తామని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన+బీజేపీలు అధికారంలోకి వస్తేనే సుమా. వీర్రాజు ప్రకటనను చూస్తేనే అర్ధమైపోతోంది ఇది జరిగే పనికాదని. దేవాదాయ శాఖను రద్దుచేసి ప్రముఖ సంస్ధలకు వాటి బాధ్యతలను అప్పగిస్తామని చెప్పటం విచిత్రంగానే ఉంది. దేవాదాయశాఖ చూస్తున్న బాధ్యతలను ప్రముఖ సంస్ధలకు అప్పగిస్తామని అంటే అర్ధమేంటి ?

హిందు సంస్ధలకు అప్పగిస్తామని అర్ధమైపోతోంది. ఒకవేళ మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే బహుశా రాష్ట్రాన్ని హిందు మత, ధార్మిక సంస్ధలే నడుపుతాయేమో తెలీదు. అంటే పేరుకు తెరపైన బీజేపీ కనబడుతున్నా తెరవెనుకంతా ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్ దళ్ లాంటి సంస్ధలే పాలనాపగ్గాలను చేపడతాయేమో. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకోవటాన్ని వీర్రాజు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. వెంకటేశ్వరస్వామిని జగన్ ఎప్పుడూ రాజకీయాలకు వాడుకోలేదు.

తాజాగా వేసిన జంబో ట్రస్టుబోర్డు విషయంలో కూడా టీడీపీ, బీజేపీలే నానా గోలచేస్తున్నాయి. ట్రస్టు బోర్డు ఏర్పాటన్నది నూరుశాతం ప్రభుత్వ ఇష్టమే. ఇందులో ప్రతిపక్షాలకు ఎలాంటి సంబంధంలేదు. ఒకవేళ ప్రభుత్వం నియమించిన బోర్డుసభ్యుల విషయంలో ఏమన్నా అభ్యంతరాలుంటే ప్రతిపక్షాలు కోర్టులో తేల్చుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో నియమించే కమీటీల్లో స్వామీజీలు, ప్రముఖులకు చోటు కల్పించాలట.

అసలు దేవాదాయ శాఖను రద్దుచేసి ప్రముఖ సంస్ధలకు అప్పగిస్తామని చేసిన ప్రకటనకు జాతీయ పార్టీ ఆమోదంఉందా అనేది డౌటు. ఎందుకంటే ఏపిలో దేవాదాయశాఖను రద్దు చేస్తామాంటే మరి మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంగతేమిటి ? తెలీదు. వీర్రాజు ప్రకటనకు జాతీయపార్టీ ఆమోదం ఉండుంటే మరి ఇప్పటికే ఆ ప్రతిపాదన ఇతర రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిందా ? అనేది మరో సందేహం. 16 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లోకి వచ్చుండాలి కదా వీర్రాజు చెప్పిన విషయం.

ఒకవేళ వీర్రాజు ప్రకటనకు జాతీయపార్టీ ఆమోదం లేకపోతే ఏపిలో కూడా అమల్లోకి వచ్చే అవకాశంలేదు. సరే ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేసినా వీర్రాజు ప్రకటనకు అసలు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదం ఉందా అనేది కూడా చూడాలి. దేవాదాయశాఖను రద్దు చేస్తే అందులోని వందలాదిమంది ఉద్యోగులను ఏమి చేస్తారనేది మరో సమస్య. ఇవన్నీ కూడా ఎప్పుడంటే జనసేన+బీజేపీలు అధికారంలోకి వస్తేనే. చూద్దాం వీర్రాజు అధికారంలోకి వచ్చేదెప్పుడు ? దేవాదాయశాఖను రద్దు చేసేదెప్పుడు ?
బీసీలంటే వెనుకబడిన తరగతులకు చెందిన వారు మాత్రమే. అలాగే బ్రాహ్మణులంటే అగ్రవార్ణాలు మాత్రమే. పై రెండు సామాజికవర్గాలకు సంబంధించిన నిర్వచనంలో ఎలాంటి విపరీతార్ధాలు లేవు. కాబట్టి బీసీ వెల్పేర్ డిపార్టుమెంటులోకి వెనుకబడిన కులాలు, ఉపకులాలకు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవటమే టార్గెట్ గా ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను పెట్టింది. ఇదే పద్దతిలో అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల్లోని పేదలను ఆదుకునేందుకు మరో కార్పొరేషన్ ఏర్పాటయ్యింది.

అంటే బీసీల కోసం ప్రత్యేకించి ఓ శాఖ అలాగే వారిని ఆదుకునేందుకు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. కాబట్టే బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకించి ఓ కార్పొరేషన ఏర్పాటైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తాజాగా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ ను తీసుకొచ్చింది. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నది ? ఎందుకంటే ఆర్ధికంగా వెనకబడిన కులాల కార్పొరేషన్లను బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేర్చటం వల్ల నిధుల సమస్య లేకుండా అని ప్రభుత్వం చెప్పింది.

ఇక్కడే అనుమానం వస్తోంది. కార్పొరేషన్లకు నిధుల సమస్య ఉందన్నపుడు అసలు కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటుచేసినట్లు ? ఆర్ధికంగా వెనకబడిన కులాలన్నపుడు పేదరికం సమస్య అన్నీ కులాల్లోను ఉంది. కమ్మ, క్షత్రియ, కాపు కులాల్లో పేదలు లేరా ? లేదా ఆ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఫుల్లుగా నిధులందిస్తోందా ? ఆర్ధికంగా ఇబ్బందులనే పరిగణలోకి తీసుకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేర్చినట్లే కమ్మ, క్షత్రియ, కాపు కార్పొరేషన్లను కూడా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేరుస్తుందా ?

కార్పొరేషన్లను ఆర్ధికంగా బలోపేతం చేయాలంటే వాటిని ఏర్పాటుచేసి గాలికొదిలేయటం కాదు. ఏర్పాటు చేసిన అన్నీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. అప్పుడే కార్పొరేషన్ల ద్వారా సదరు కులాలకు చెందిన పేదలు ఏదో రూపంలో లబ్దిపొందుతారు. లేకపోతే కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం అలంకారానికి మాత్రమే పరిమితమైపోతుంది. మహా అయితే కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్లు ప్రింట్ చేయించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.