Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు కూల్చండి!

By:  Tupaki Desk   |   22 Sept 2020 5:40 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు కూల్చండి!
X
హైదరాబాద్ లో భారీ వర్షాలకు అంతా జలమయమైంది. ఓ చిన్నారి బాలిక సుమేధ అందులో పడి కొట్టుకుపోయింది.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పై సుమేధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలాలపై కప్పులు లేకుండా చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డ ప్రాణాలు పోయేలా చేశారని ఆరోపించాడు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కబ్జాలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఎల్బీనగర్ లోని రెడ్డి నగర్ కాలనీలో నాలా ప్రాంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించాడు. ఈ నిర్మాణాలు కూల్చేయండని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ విషయంలో ఏం జరిగినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

హైదరాబాద్ లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. నాలాల వద్ద సరైన నిర్వహణ లేక అందులో పిల్లలు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని ఆరోపించారు.

కాలనీల్లో మంత్రి కేటీఆర్ తక్షణమే పర్యటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ప్రజలు అందుబాటులో ఉండట్లేదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు సహాయ చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.