Begin typing your search above and press return to search.

యూపీలో దారుణం..వృద్దుడిపై అమానుషం..

By:  Tupaki Desk   |   4 Sept 2018 4:54 PM IST
యూపీలో దారుణం..వృద్దుడిపై అమానుషం..
X
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు - రిటైర్ పోలీస్ అధికారిని రాడ్ లతో నడిరోడ్డు మీద చావబాదుతున్నా జనం చూస్తునే వెళ్లారు తప్పితే కనీసం ఏంటి అన్యాయం అని ప్రశ్నించలేకపోయారు. దీంతో ఆ దుండగులు చేతిలో దెబ్బలు తిని ఆ రిటైర్ పోలీస్ అధికారి మరణించారు. ఈ అమానుష ఘటన అక్కడి సీసీ టీవీ రికార్డుల్లో నమోదు కావడంతో వైరల్ గా మారింది.

70 ఏళ్ల అబ్దుల్ సమద్ ఖాన్ పోలీస్ శాఖలో ఎస్ ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. సోమవారం సైకిల్ పై వెళ్తుండగా ఓ వ్యక్తి పెద్ద రాడ్ తో వచ్చి అతడిపై దాడి చేశాడు. దీంతో అబ్దుల్ కిందపడిపోగా.. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి రాడ్ లతో కొట్టారు. సృహ తప్పి పడిపోయాక అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. స్థానికులు అబ్దుల్ ను ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చంపిన వ్యక్తులకు , అబ్ధుల్ కు మధ్య కొద్దిరోజులుగా భూ వివాదం ఉంది. ఆ నేపథ్యంలోనే అబ్ధుల్ పై దాడికి దిగినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరికి ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.