Begin typing your search above and press return to search.

బ్లాక్ మార్కెట్ లో రెమ్ ‌డెసివిర్‌ ఇంజక్షన్లు !

By:  Tupaki Desk   |   17 April 2021 1:30 PM GMT
బ్లాక్ మార్కెట్ లో రెమ్ ‌డెసివిర్‌ ఇంజక్షన్లు !
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 2లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. అలాగే వైరస్ తీవ్రత దృష్ట్యా ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి భారీగా పెరుగుతుండటంతో, ఈ చికిత్సలో వినియోగిస్తున్న రెమ్ ‌డెసివిర్‌ ఇంజక్షన్ కి అనూహ్య గిరాకీ ఏర్పడింది. వ్యాధి తీవ్రత ఎక్కువై, శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా వైద్యులు ఈ ఔషధాన్ని అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన తొలి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఒక్కో డోసు చొప్పున... మొత్తం ఆరు డోసుల రెమ్‌ డెసివిర్‌ ఔషధాన్ని ఇవ్వడం వల్ల కరోనా బాధితుడు కోలుకునే అవకాశం ఉంది. మొదటి దశ కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఈ వ్యాక్సిన్ పైనే అధికంగా ఆధారపడ్డారు. అయితే , సెకండ్ వేవ్ కొనసాగుతున్న ఈ సమయంలో రెమ్ డెసివిర్ ఉత్పత్తిని రెట్టింపు చేసినట్లు ఔషధ తయారీ సంస్థ సిప్లా తెలిపింది. కరోనా కేసుల పెరుగుదల సహా, డ్రగ్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి పెంచినట్లు వెల్లడించింది.

అయితే , కరోనా సోకిన వారికి ఈ డ్రగ్ ఇస్తే దాదాపుగా కోలుకునే అవకాశం ఉంది. అలాంటి ఈ డ్రగ్ ను గుంటూరు జిల్లాల్లో బ్లాక్ మార్కెట్ లో కొందరు కేటుగాళ్లు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారట. నర్సరావుపేట లో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న ముగ్గురిని డ్రగ్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నారట. ఆ ముగ్గురు సభ్యుల నుండి ఇంజెక్షన్స్ తో పాటుగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారట. అయితే , ఈ ముఠా సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేస్తారని , అక్కడ ఈ రెమ్ డెసివిర్ ఇంజక్షన్ దొంగతనం చేసి , బ్లాక్ మర్కెట్స్ లో అమ్ముతున్నారని అధికారులు గుర్తించారట.

అమెరికా కంపెనీ అయిన గిలీడ్‌ సైన్సెస్‌ కు చెందిన ఈ ఔషధాన్ని మనదేశంలో 5 ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెటిరో ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఉన్నాయి. ఇవే కాక సిప్లా, క్యాడిలా హెల్త్‌ కేర్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, మైలాన్‌ ఇండియా కూడా రెమ్‌డెసివిర్‌ తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొవిడ్‌-19 వ్యాధి తీవ్రమై ఆస్పత్రుల్లో చేరిన వారికి ఉపశమనం కలిగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన ఔషధం ఇదొక్కటే కావడం గమనార్హం. మనదేశంలో కూడా ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగం నిమిత్తం దీనికి అనుమతి ఇచ్చింది. తొలుత ఈ ఔషధాన్ని ఒక్కో డోసును రూ.6,000 ధరకు ఫార్మా కంపెనీలు విక్రయించాయి. అంటే 6 డోసుల చికిత్సకు రూ.36,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీలు రూ.1,000 ధరకే ఒక్కో డోసు ఇంజక్షన్ ‌ను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నాయి.