Begin typing your search above and press return to search.

రేపిస్ట్ రాజు..నేరచరిత్ర, గతంలో ఏంచేశాడంటే

By:  Tupaki Desk   |   17 Sep 2021 11:30 AM GMT
రేపిస్ట్ రాజు..నేరచరిత్ర, గతంలో ఏంచేశాడంటే
X
హైదరాబాద్ సింగరేణి కాలనీలో గత గురువారం రాత్రి ఆరేళ్ళ పాపపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసిన నిందితుడు రాజుకు నేరచరిత్ర ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఆటో ట్రాలీ చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. తాజాగా గత శుక్రవారం పారిపోయే ప్రయత్నంలో ఉండి ఎల్బీనగర్‌ పరిధిలో మరో ఆటో చోరీకి యతి్నంచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఎన్టీఆర్‌ నగర్‌ కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ ఈ ఏడాది జనవరి 22 మధ్యాహ్నం తన ఆటో ట్రాలీ డ్రైవర్‌ తో కొత్తపేట పండ్ల మార్కెట్‌ వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఫ్రూట్‌ మార్కెట్‌ ఫ్లాట్‌ ఫామ్‌ పై పార్క్‌ చేసి ప్రార్థనల నిమిత్తం వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆటో ట్రాలీ కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు రాజును అరెస్టు చేశారు.

గత గురువారం రాత్రి నుంచి పరారీలో ఉన్న రాజు ఆ మరుసటి రోజు యాకత్‌పురా రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ కూలి్చవేత పనికి వెళ్లాడు.

అది పూర్తయిన తర్వాత అక్కడ నుంచి తన సహ కూలీతో కలిసి ఎల్బీనగర్‌ వరకు చేరుకున్నాడు. ఆ చౌరస్తాలోని బ్రాండ్‌ ల్యాండ్‌ హోటల్‌ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్‌లో కొద్దిసేపు తచ్చాడాడు. అక్కడ పార్క్‌ చేసి ఉన్న ఓ ఆటోను తస్కరించి, అందులో పారిపోవాలని ప్రయత్నం చేశాడు. రాజు దాన్ని స్టార్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా అసలు డ్రైవర్‌ అక్కడకు చేరుకున్నాడు. అతడు రాజును అడ్డుకోవడంతో పాటు కొద్దిసేపు వాగ్వాదానికీ దిగాడు. ఆపై అక్కడ నుంచి జారుకున్న రాజు ఉప్పల్‌ కు చేరుకున్నాడు. అనేక సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ ను పరిశీలించిన పోలీసులు ఈ విషయాలు గుర్తించారు. నగర పోలీసులు శుక్రవారం నుంచే రాజు ఫొటోను వైరల్‌ చేసి ఉంటే... ఎల్బీనగర్‌ లోనే ఆటోడ్రైవర్‌ గుర్తించి పట్టుకునే అవకాశం ఉండేది.

ఇక ఇదిలా ఉంటే స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలుకింద పది రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులలో రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడింది. ఇక పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు వరంగల్ లోనే రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.