Begin typing your search above and press return to search.

గాంధీలో కరోనా పేషేంట్స్ కి రంజాన్ స్పెషల్ ఫుడ్ ..!

By:  Tupaki Desk   |   25 April 2020 7:10 AM GMT
గాంధీలో కరోనా పేషేంట్స్ కి రంజాన్ స్పెషల్ ఫుడ్ ..!
X

నేటి నుండి ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు శనివారం నుండి ప్రారంభం కాబోతున్నట్టు మత పెద్దలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో ముస్లిం కరోనా రోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ముస్లింలకు పౌష్టికరమైన ఆహారం అందించాలని నిర్ణయించింది. షెహరి - ఇఫ్తార్ విందుల్లో వారికి వెజ్ - నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది. శనివారం నుంచి కొత్త మెనూ ప్రారంభంకానుంది.

ఈ మెనూని రుచికరంగా అందించనున్నారు.. ఈ భోజానానికి ఒక్కొక్కరికి రోజుకు రూ.500 ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తుంది. వార్డుల్లో ముస్లింలకు వేకువజామున 3.30 గంటలకు షెహరిలో రోటీ, వెజ్ కర్రీ, పప్పు, అన్నం.. సాయంత్రం 7.30 గంటలకు ఇఫ్తార్‌ లో కిచిడి, టమోటా చట్నీ, చికెన్ ఫ్రై.. బగారా - దాల్చా.. వెజ్ బిరియాని అందిస్తారు. ఇక షెహరీ లో భాగంగా రోజు మార్చి రోజు మటన్ కూడా ఉంటుంది. అలాగే ఇఫ్తార్‌ లో రోజు మార్చి రోజు చికెన్ బిర్యానీ.. గుడ్డు - అన్నం - వెజ్ కర్రీ ఉంటుంది. అలాగే ఉదయం సాయంత్రం టీ - పాలు కూడా ఇస్తారు. వీటితో పాటూ అల్ఫాహారంగా ఖర్జూరం - అరటిపండ్లు - ఇతర పండ్లను అందిచబోతున్నారు.

రంజాన్ మాసం ప్రారంభంకావడంతో గాంధీ ఆస్పత్రిలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారని , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ ముస్లిమేతర పేషంట్లను వేరే గదిలోకి తరలిస్తారని , ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.