Begin typing your search above and press return to search.

మోడీ తర్వాత ఆ అవకాశం రజనీకే దక్కింది

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:10 AM GMT
మోడీ తర్వాత ఆ అవకాశం రజనీకే దక్కింది
X
పాపులార్టీ విషయం లో ప్రధాని మోడీ తో తమిళ సూపర్ స్టార్ రజనీ పోటీ పడలేకపోవచ్చు. కానీ.. ఆయనకంటూ ఇమేజ్ మాత్రమే కాదు.. ఆయన కోసం దేనికైనా సై అనే అభిమాన గణం భారీగానే ఉందని చెప్పాలి. కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ చేసిన ఒక కార్యక్రమం పెద్ద చర్చకు తెర తీసింది. ఇంటర్నేషనల్ సిరీస్ మేన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీకి సంబంధించి మోడీ చేసిన ఎపిసోడ్ ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే.

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వివరాలు పాపులర్ కావటమే కాదు.. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే సమయంలో వీక్షక ఆదరణ అదిరినట్లుగా చెప్పారు. ఈ కారణంతోనే కావొచ్చు.. దేశం లో మోడీ తర్వాత భారీ పాపులార్టీ ఉన్న వ్యక్తుల్ని వెతికిన సదరు ఛానల్.. తాజాగా రజనీకాంత్ ను ఎంపిక చేసుకోవటమే కాదు.. ఆయన్ను ఒప్పించింది. ఈ షూటింగ్ లో పాల్గొనటానికి బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు రజనీ చేరుకున్నారు.

ఈ రోజు (మంగళవారం) బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలిసి రజనీ షూటింగ్ లో పాల్గొననున్నారు. మోడీ తర్వాత ఈ డాక్యుమెంటరీలో నటించే అవకాశం రజనీకి లభించటం ఆసక్తి కరంగా మారగా.. ఆయన అభిమానులు మాత్రం విపరీతమైన ఆనందానికి గురి అవుతున్నారు. రజనీ తర్వాత ఈ గురువారం బాలీవుడ్ హీరోఅక్షయ్ కుమార్ మీద కూడా షూట్ చేస్తారని చెబుతున్నారు. చూస్తుంటే.. మోడీతో మన దేశంలో పాపులర్ అయిన ఈ ప్రోగ్రాం ను పలు రంగాలకు చెందిన ప్రముఖులతో షూట్ చేయటం ద్వారా సదరుఛానల్ భారీ ప్రణాళికనే వేసుకున్నట్లుగా కనిపిస్తోందే?