Begin typing your search above and press return to search.

షాంపైన్ తాగాను.. ఆ ఫొటో లీక్ చేసింది ఆయనే: ఎంపీ రఘురామ

By:  Tupaki Desk   |   12 Oct 2020 12:10 PM GMT
షాంపైన్ తాగాను.. ఆ ఫొటో లీక్ చేసింది ఆయనే: ఎంపీ రఘురామ
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీరు ఆది నుంచి వివాదాస్పదమే..ఆయన ఏం చేసిన వైరల్ అవుతోంది. ఆయన ప్రత్యర్థులు రఘురామ పాత ఫొటోలను వెలికి తీసి మరీ వైరల్ చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ హల్ చల్ చేస్తోంది. రఘురామకృష్ణం రాజు ఓ పార్టీలో ఒక అందమైన డ్యాన్సర్ మీద నుంచి షాంపైన్ పోస్తుండగా.. రఘురామ ఆబగా తాగుతున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఫొటోపై రఘురామ స్పందించారు.

సోషల్ మీడియాలో ఓ ఫొటోతో రెండు రోజులుగా ట్రోల్ చేశారని.. ఆ ఫొటో వెనుక స్టోరీని చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం జరిగిన పార్టీలో ఈ ఫొటో తీశారని.. ఆ ఫొటో ఎప్పుడూ చూడలేదని.. ఈ ఫొటో అందించిన పెద్దలు.. బహుశా ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అనుకుంటున్నట్టు రఘురామ తెలిపారు.

ఇక ఆ ఫొటోలో తప్పేముంది అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. షాంపైన్ క్రికెటర్లు తాగుతారని.. తాను తాగడంలో తప్పేముందున్నారు. కోల్ కతా, హైదరాబాద్ గుర్తులేదు కానీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీగారి కుమారుడు ఇచ్చిన ఫంక్షన్ లో ఫొటో తీశారని రఘురామ అన్నారు.

ఆ సెలెబ్రేషన్స్ లో భాగంగా అందరి నోట్లో షాంఫైన్ పోశారని.. తన నోట్లోనూ పోశారని రఘురామ వివరణ ఇచ్చారు. వైసీపీ వాళ్లు ఇచ్చిన పార్టీల్లో ఇవన్నీ కామన్ అని.. రష్యన్ అమ్మాయిలు ఉంటారని అన్నారు. తాను ఏమీ అసభ్యంగా మాట్లాడలేదని.. ఎవరి మీద చేతులు వేయలేదని అన్నారు. షాంపైన్ పోస్తే ఆ ఫొటోను తీసుకొని ఉన్మాదుల్లా రెచ్చిపోయారు అంటూ మండిపడ్డారు.