Begin typing your search above and press return to search.

భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

By:  Tupaki Desk   |   29 April 2021 12:00 PM IST
భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
X
భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కు మరింత బలం చేకూరింది. ఐదో జనరేషన్ ఫైథాన్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది.

భారత్ తయారు చేసిన తేజర్ యుద్ధ విమానానికి ‘ఎయిర్ టు ఎయిర్’ ఆయుధ సామర్థ్యానికి 5వ జనరేషన్ ఫైథాన్ మిసైల్ జతకలిసింది.

తాజాగా ఈ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఈ మిసైల్ అధిక వేగంతో ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది. ఫైథాన్ క్షిపణులు వందశాతం లక్ష్యాలను ఛేదిస్తాయి. దీంతో వాటి పూర్తి సామర్థ్యం రుజువైంది. ప్రణాళిక ప్రకారం ఈ ప్రయోగం అన్ని అంశాలను పూర్తి చేసిందని డీఆర్డోవో తెలిపింది.

గోవాలోని ఫైరింగ్ రేంజ్ లో అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఈ మిసైల్ ను టెస్ట్ చేశారు. అది టార్గెట్ ను విజయవంతంగా ఛేదించిందని డీఆర్డీవో తెలిపింది.