Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ కు అన్న కేఏ పాల్ అట..!

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:45 AM GMT
బండ్ల గణేష్ కు అన్న కేఏ పాల్ అట..!
X
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వినూత్న హావభావాలతో పలికి ఫేమస్ అయిన టాలీవుడ్ కమెడియన్ ఫృథ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రాజకీయాల్లో బండ్ల గణేష్ కామెడీ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ బాధ్యతను కేఏ పాల్ తీసుకున్నారని.. హాస్యం పండిస్తున్నారని’ సెటైర్ వేశారు. ప్రజలకు ఆశీర్వాదం అందించడానికి వచ్చిన వ్యక్తి దానికే పరిమితం అవ్వాలని స్పష్టం చేశారు.

మొన్న బండ్ల గణేష్ కూడా ఇలానే అన్నాడని.. కేఏ పాల్ ను చూస్తుంటే బండ్ల గణేష్ కు అన్నయ్యలా కనిపిస్తున్నాడని ఫృథ్వీ విమర్శించారు. ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన కేఏ పాల్.. ఇచ్చి వెళ్లిపోవాలని సూచించారు. నీకు రాజకీయాలెందుకు.. ప్రజలంతా నిన్ను ముఖ్యమంత్రిని అయిపోమని కోరుతున్నారా అని ఫృథ్వీ నిలదీశారు. అసలు కేఏపాల్ అంటూ ఎవరో కూడా తనకు తెలియదని ఫృథ్వీ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో కేఏ పాల్ ను చూశానని.. మళ్లీ ఇప్పుడెందుకు వచ్చాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. పిట్టల దొర మాటలు చెబితే మాటలు నమ్మరని.. పెట్టా బేడా సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉండు అంటూ ఫైర్ అయ్యారు.

‘మేమంతా సినిమాల్లో చేస్తోంది అసలైన కామెడీ.. కేఏ పాల్ ఎవరతను.. ఈ మధ్య కామెడీ చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.. దానికి నేను ఒప్పుకోను’ అంటూ ఫృథ్వీ పంచ్ విసిరారు. లక్ష కోట్లు తెస్తా.. ట్రంప్ ను కూర్చోబెట్టా లాంటి కబుర్లు చెప్పేవాళ్లని పిట్టల దొర అని పిలుస్తారని ఫృథ్వీ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్లాన్ ప్రకారమే కేఏ పాల్ ను రంగంలోకి దించారని అర్థమవుతోందని ఫృథ్వీ సంచలన కామెంట్ చేశారు. కొన్ని చానెళ్లు అతడికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయని ఫృథ్వీ ఆరోపించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఆపాలని టీడీపీ నేతలకు, కేఏ పాల్ కు సూచించారు.