Begin typing your search above and press return to search.
ఇంటినే వ్యభిచార కేంద్రంగా: గుట్టురట్టు చేసిన పోలీసులు
By: Tupaki Desk | 10 July 2020 7:30 AM GMTఇంటినే వ్యభిచార కేంద్రంగా మార్చి అమ్మాయిల తో వ్యభిచారం చేయిస్తున్న ఘటన ఖమ్మం పట్టణం లో వెలుగు చూసింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై ఖమ్మం పోలీసులు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు విటులు, ఒక మహిళ అరెస్టయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మంలోని కల్వొడ్డు ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి యువకుల రాక పెరుగుతోంది. రోజు పెద్ద సంఖ్య లో యువకులు వచ్చి వెళ్తుండడం తో స్థానికులకు అనుమానం వచ్చింది. స్థానికులు అనుమానం వచ్చి వివరాలు తెలుసుకోగా వ్యభిచార దందా కొనసాగుతోందని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ఇంటి పై దాడులు నిర్వహించ గా వ్యభిచార కేంద్ర గుట్టు రట్టయ్యింది.
అక్కడ ముగ్గురు యువతులతో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో కూసుమంచి కి చెందిన ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యువతులను, నిస్సహాయ మహిళలను తీసుకొచ్చి ఖమ్మంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిర్వాహకురాలి తో పాటు విటులను రిమాండ్కు తరలించారు. ఇక సెక్స్ వర్కర్లను ప్రభుత్వ వసతిగృహానికి తరలించారు. ఈ విధంగా ఓ మహిళ ఇంటిని అద్దె కు తీసుకుని వ్యభిచారం నిర్వహించడం ఖమ్మంలో హాట్ టాపిక్గా మారింది.
ఖమ్మంలోని కల్వొడ్డు ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి యువకుల రాక పెరుగుతోంది. రోజు పెద్ద సంఖ్య లో యువకులు వచ్చి వెళ్తుండడం తో స్థానికులకు అనుమానం వచ్చింది. స్థానికులు అనుమానం వచ్చి వివరాలు తెలుసుకోగా వ్యభిచార దందా కొనసాగుతోందని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ఇంటి పై దాడులు నిర్వహించ గా వ్యభిచార కేంద్ర గుట్టు రట్టయ్యింది.
అక్కడ ముగ్గురు యువతులతో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో కూసుమంచి కి చెందిన ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యువతులను, నిస్సహాయ మహిళలను తీసుకొచ్చి ఖమ్మంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిర్వాహకురాలి తో పాటు విటులను రిమాండ్కు తరలించారు. ఇక సెక్స్ వర్కర్లను ప్రభుత్వ వసతిగృహానికి తరలించారు. ఈ విధంగా ఓ మహిళ ఇంటిని అద్దె కు తీసుకుని వ్యభిచారం నిర్వహించడం ఖమ్మంలో హాట్ టాపిక్గా మారింది.