Begin typing your search above and press return to search.
ప్రశంసలు సరే.. నిధుల మాటేమిటి? కేంద్రానికి కేటీఆర్ సూటి ప్రశ్న
By: Tupaki Desk | 22 Jan 2021 5:21 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కొంత భిన్నమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ రూ. వేల కోట్ల అవినీతి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర మంత్రులమే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా విమర్శలకు దిగుతున్నది. బీజేపీ, టీఆర్ఎస్ మిత్రపక్షాలనేనని.. కానీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతుంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.
ఇటీవల బండి సంజయ్ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని.. ఆయనను జైలుకు పంపుతామని సంజయ్ పేర్కొన్నారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి జల్ శక్తి గజేంద్ర సింగ్ షేఖావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. మిషన్ భగీరథ ఎంతో గొప్పపథకమని కొనియాడారు. రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు తాగునీరు అందించడం గొప్ప కార్యక్రమని ప్రశంసించారు.
ఎఫ్హెచ్టీసీ (ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్) అంటే ఇంటింటికి 100 శాతం తాగునీటి సౌకర్యం కల్పించడంలో గోవా, తెలంగాణ రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయని ఇటీవల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ ఓ ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
అయితే ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. కృతజ్ఞతలు తెలిపినందుకు ఆయన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక మంత్రికి చురకలు కూడా అంటించారు. ‘ షెకావత్ జీ మీరు మిషన్భగీరథ పథకాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. అయితే మాకు నీతి అయోగ్ ద్వారా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా అందించలేదు. ఈ విషయాన్ని కూడా కాస్త గుర్తించండి’ అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.
ఇటీవల బండి సంజయ్ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని.. ఆయనను జైలుకు పంపుతామని సంజయ్ పేర్కొన్నారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి జల్ శక్తి గజేంద్ర సింగ్ షేఖావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. మిషన్ భగీరథ ఎంతో గొప్పపథకమని కొనియాడారు. రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు తాగునీరు అందించడం గొప్ప కార్యక్రమని ప్రశంసించారు.
ఎఫ్హెచ్టీసీ (ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్) అంటే ఇంటింటికి 100 శాతం తాగునీటి సౌకర్యం కల్పించడంలో గోవా, తెలంగాణ రాష్ట్రాలు సక్సెస్ అయ్యాయని ఇటీవల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ ఓ ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
అయితే ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. కృతజ్ఞతలు తెలిపినందుకు ఆయన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక మంత్రికి చురకలు కూడా అంటించారు. ‘ షెకావత్ జీ మీరు మిషన్భగీరథ పథకాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. అయితే మాకు నీతి అయోగ్ ద్వారా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా అందించలేదు. ఈ విషయాన్ని కూడా కాస్త గుర్తించండి’ అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.
