Begin typing your search above and press return to search.

ఇంత ఆరాచకపు సీన్ కర్ణాటక రాష్ట్రంలోనే సాధ్యమేమో?

By:  Tupaki Desk   |   20 July 2020 4:00 AM GMT
ఇంత ఆరాచకపు సీన్ కర్ణాటక రాష్ట్రంలోనే సాధ్యమేమో?
X
సోషల్ మీడియా పుణ్యమా అని.. బయటకు వస్తున్న వీడియోల పుణ్యమా అని చాలా సందర్భాల్లో షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. హద్దులు దాటిన నిర్లక్ష్యం ఆరాచకంగా మారటమే కాదు.. ప్రభుత్వం పని తీరు ఎంత దారుణంగా ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో స్పష్టం చేస్తోంది. కర్ణాటక లోని బీజేపీ సర్కారు పరువు తీసేలా మారిన ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.

కోవిడ్ 19 రోగులకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని.. వారు కోలుకునేందుకు తాము చేపట్టిన చర్యల గురించి అందరు ముఖ్యమంత్రుల మాదిరే కర్ణాటకలోని యడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే.. మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసం ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి. తాజాగా ఒక క్వారంటైన్ సెంటర్లో పందులు స్వైర విహారం చేయటం గమనార్హం.

కర్నాకటలోని ఒక కోవిడ్ సెంటర్లో పందులు గుంపులుగా తిరుగుతున్న వైనం చూసినోళ్లంతా వణికిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ ఇచచే తీరు ఇదేనా? అని విపక్షాలు మండిపతున్నాయి. ఈ ఉదంతంపై రాష్ట్ర మంత్రి శ్రీరాములు అధికారులపై ఫైర్ అవుతున్నారు. క్వారంటైన్ సెంటర్లోకి పందులు ఎలా వస్తాయి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క ఉదంతం చాలు.. కర్నాటకలో యడ్డి సర్కారు ఎంతలా ఫెయిల్ అయ్యిందో తెలియటానికి అని విపక్షాలు మండిపతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం యడ్డికి.. తాజా వైరల్ వీడియో మరిన్ని తలనొప్పులకు కారణమైందని చెప్పక తప్పదు.