Begin typing your search above and press return to search.

ఆపరేషన్ చేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   18 Sept 2015 12:07 PM IST
ఆపరేషన్ చేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడు
X
డాక్టర్లు ఆపరేషన్ చేయలేదని ఓ రోగి ఏకంగా హాస్పిటల్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. చోటు చేసుకుంది.

సతీష్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన జులై నెలలో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే సతీష్‌కు ఇప్పటికే ఆసుపత్రి వైద్యులు చికిత్స చేశారు. కానీ పూర్తిగా నయం కావాలంటే ఆపరేష‌న్‌ ను చేయాల్సిందేనని గత కొన్ని రోజులుగా సతీష్ డాక్టర్లను అడుతుగున్నాడు... అయితే.. ఆపరేషన్ చేయడంలో ఆలస్యం కావడంతో తనకు సరిగా చికిత్స అందడం లేదనే మనస్తాపంతో సతీష్ తెల్లవారుజామున 4 గంటలకు ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము ఆపరేషన్ చేయబోమని చెప్పలేదని అంటున్నారు.