Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి కరోనా!!

By:  Tupaki Desk   |   11 Sept 2020 9:02 PM IST
కేంద్రమంత్రికి కరోనా!!
X
కరోనా ఎవ్వరిని వదలడం లేదు. దేశవ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరికీ సోకుతోంది.

తాజాగా పార్లమెంట్ సమావేశాల వేళ కేంద్రమంత్రులపై కరోనా దాడి చేస్తోంది. వర్షాకాల సమావేశాలకు టైం దగ్గర పడుతున్న వేళ తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా పాజిటివ్ గా తేలింది.

ఎలాంటి లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకుంటే కరోనా అని తేలిందని కేంద్రమంత్రి ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించారు. తనకు ఎలాంటి సమస్యలు లేవని.. ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీలందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్ కోరారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రికి కరోనా బయటపడింది.