Begin typing your search above and press return to search.

ఫ్లాష్: 12మంది చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు కరోనా

By:  Tupaki Desk   |   28 Aug 2020 5:35 PM GMT
ఫ్లాష్: 12మంది చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు కరోనా
X
ఐపీఎల్ మరి కొద్ది వారాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బారిన పడింది. ధోని జట్టులోని ఓ భారత పేసర్ సహా పదిమంది సపోర్ట్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. గతంలో కరోనా బారిన పడిన దీపక్ చాహర్ వల్ల సోకిందా? లేక జట్టు సభ్యులు దుబాయ్ చేరుకున్న తర్వాత కరోనా సోకిందా అని ఆరాతీస్తున్నారు.

దీంతో టీం మొత్తాన్ని వారంపాటు క్వారంటైన్ కు తరలించినట్టు సమాచారం. ఆగస్టు 21న దుబాయ్ చేరుకున్న సీఎస్కే టీంకు ఇప్పుడు కరోనా సోకడంతో ఆ దేశంలోనే అంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పుడు టీం మొత్తం వారం పాటు క్వారంటైన్ కు వెళుతోంది.

ఐపీఎల్ ప్రారంభం ముందు చెన్నై టీంను కరోనా కబళిస్తుండడం కలకలం రేపుతోంది. అప్పటివరకు ఎంత మందికి సోకుతుందనేది ఆందోళనగా ఉంది.