Begin typing your search above and press return to search.

కోవిడ్ బాధితులకు సన్ రైజర్స్ యాజమాన్యం 30 కోట్ల విరాళం

By:  Tupaki Desk   |   10 May 2021 9:36 AM GMT
కోవిడ్ బాధితులకు సన్ రైజర్స్ యాజమాన్యం 30 కోట్ల విరాళం
X
కరోనా కల్లోలంతో అట్టుడుకుతున్న దేశానికి ఊరటనిచ్చేలా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ సంస్థ భారీ విరాళం ప్రకటించింది.దేశంలో కోవిడ్ సహాయ చర్యలకు గాను రూ.30 కోట్ల భారీ విరాళం ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కోవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితరాల కోసం అందజేస్తున్నట్టు సన్ టీవీ ప్రకటించింది.

సన్ టీవీ ఆధీనంలో ఉన్న అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు సన్ టీవీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ విరాళం ద్వారా భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది.