Begin typing your search above and press return to search.
ఒక్కమ్యాచ్ ఆ ఆటగాడి జాతకం మార్చేసింది.. !
By: Tupaki Desk | 23 Feb 2021 8:00 AM ISTఇంగ్లాండ్తో జరుగనున్న టీ20 సీరిస్కు లెగ్స్పిన్నర్, ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా ఎంపికయ్యాడు. అయితే రాహుల్ను ఈ సీరిస్కు ఎంపిక చేయడానికి కారణమేంటి? సెలక్టర్ల దృష్టిని అతడు ఎలా ఆకర్షించాడంటే..
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో రాహుల్ సత్తా చాటాడు. తన ఆల్రౌండ్ ప్రతిభను చాటాడు. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున ఆడిన రాహుల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు. కీలక సమయంలో
31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు సాధించి రాజస్థాన్కు విజయాన్ని అందించాడు. ఈ ఒక్క మ్యాచ్ అతడి కెరీర్ ను మార్చేసింది. టీంఇండియా సెలక్టర్లు ఈ మ్యాచ్ను చూసే రాహుల్ను ఎంపికచేశారట.
ఎంపిక కావడం పట్ల రాహుల్ మాట్లాడుతూ.. ‘ నేను టీంఇండియా టీ20 కి సెలక్ట్ అయినట్టు యజువేంద్ర చహల్ చెప్పాడు. అయితే అతడు కాల్ చేయగానే జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత మోహిత్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యా. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. హర్యానా నుంచి టీం ఇండియాకు ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఆడారు. చహల్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్ టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అయితే నాకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటాను’ అని చెప్పారు రాహుల్.
టీమిండియాకు ఎంపికయిన మరునాడే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హరియానా తరఫున ఆడుతున్న రాహుల్ తెవాటియా.. చండీగఢ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. తెవాటియా రాణించినా హరియానాకు ఓటమి తప్పలేదు.ముంబై బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా టీ20 జట్టుకు ఎంపికయ్యారు. సూర్యకుమార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీం ఇండియాలో చోటు దక్కింది. ఆస్ట్రేలియా టూర్కు సూర్య కుమార్ను ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో రాహుల్ సత్తా చాటాడు. తన ఆల్రౌండ్ ప్రతిభను చాటాడు. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున ఆడిన రాహుల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు. కీలక సమయంలో
31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు సాధించి రాజస్థాన్కు విజయాన్ని అందించాడు. ఈ ఒక్క మ్యాచ్ అతడి కెరీర్ ను మార్చేసింది. టీంఇండియా సెలక్టర్లు ఈ మ్యాచ్ను చూసే రాహుల్ను ఎంపికచేశారట.
ఎంపిక కావడం పట్ల రాహుల్ మాట్లాడుతూ.. ‘ నేను టీంఇండియా టీ20 కి సెలక్ట్ అయినట్టు యజువేంద్ర చహల్ చెప్పాడు. అయితే అతడు కాల్ చేయగానే జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత మోహిత్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యా. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. హర్యానా నుంచి టీం ఇండియాకు ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఆడారు. చహల్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్ టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అయితే నాకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటాను’ అని చెప్పారు రాహుల్.
టీమిండియాకు ఎంపికయిన మరునాడే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హరియానా తరఫున ఆడుతున్న రాహుల్ తెవాటియా.. చండీగఢ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. తెవాటియా రాణించినా హరియానాకు ఓటమి తప్పలేదు.ముంబై బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా టీ20 జట్టుకు ఎంపికయ్యారు. సూర్యకుమార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీం ఇండియాలో చోటు దక్కింది. ఆస్ట్రేలియా టూర్కు సూర్య కుమార్ను ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
