Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో విషాదం: కరోనా భయంతో ఆత్మహత్య
By: Tupaki Desk | 2 May 2020 3:00 PM GMTకొంచెం అనారోగ్యానికి గురయితే చాలు ఇప్పుడు అందరూ కరోనా అని భయపడుతున్నారు. ప్రసార మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో దీనిపైనే చర్చ సాగుతోంది. ఎక్కడ చూసినా కరోనా.. కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వృద్ధులకు - దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేలింది. ఇదే భయంతో ఓ వృద్ధుడు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లితే కరోనా లేదని చెప్పినా కూడా ఆయన భయపడుతూ చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ రామంతాపూర్ కు చెందని వ్యక్తి ఆయాసంతోపాటు గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి కరోనా లేదని తేల్చిచెప్పారు. అయినా ఆయన కరోనా ఉందేమోనని భయాందోళన చెందుతున్నాడు. అతడి ఆందోళనను గమనించిన కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. అయితే తెల్లారి శనివారం ఆయన అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులతో పాటు అపార్ట్ మెంట్ వాసులు షాక్ కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో కరోనా సోకడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే పుకార్లు వ్యాప్తి చెందాయి. దీనిపై స్పందించిన పోలీసులు అలాంటిదేమీ లేదని.. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్ రామంతాపూర్ కు చెందని వ్యక్తి ఆయాసంతోపాటు గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి కరోనా లేదని తేల్చిచెప్పారు. అయినా ఆయన కరోనా ఉందేమోనని భయాందోళన చెందుతున్నాడు. అతడి ఆందోళనను గమనించిన కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. అయితే తెల్లారి శనివారం ఆయన అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులతో పాటు అపార్ట్ మెంట్ వాసులు షాక్ కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో కరోనా సోకడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే పుకార్లు వ్యాప్తి చెందాయి. దీనిపై స్పందించిన పోలీసులు అలాంటిదేమీ లేదని.. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.