Begin typing your search above and press return to search.
గవర్నర్ చేతికి ఓటుకు నోటు కేసు!
By: Tupaki Desk | 22 Jun 2015 1:38 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంచలనం సృష్టించటమే కాదు.. రాజకీయ అగ్గిని రాజేసి ఓటుకు నోటు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రేవంత్ రెడ్డితోపాటు.. ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర కూడా ఉందంటూ ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చి సంచలనం సృష్టించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి వెళ్లింది.
తాజాగా ఈ కేసును పర్యవేక్షించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు అటార్నీ జనరల్ నోటి మాటగా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎలా వ్యవహరించాలన్న అంశంపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరిన నేపథ్యంలో.. వారి నుంచి ఈ సమాధానం వచ్చిందని చెబుతున్నారు.
ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్ర పోలీసులకు చట్ట పరిధి ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పినట్లుగా చెబుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. శాంతిభద్రతలకు సంబంధించి ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ పర్యవేక్షించొచ్చని చెప్పినట్లుగా సమాచారం.
అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో.. ఓటుకు నోటు కేసు వ్యవహారం మొత్తంగా గవర్నర్కు దఖలు పడినట్లుగా చెప్పొచ్చు. అయితే.. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ చేతికి ఓటుకు నోటు కేసు వెళ్లటం.. ఈ వ్యవహారంలో కీలక మలుపుగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
తాజాగా ఈ కేసును పర్యవేక్షించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు అటార్నీ జనరల్ నోటి మాటగా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎలా వ్యవహరించాలన్న అంశంపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరిన నేపథ్యంలో.. వారి నుంచి ఈ సమాధానం వచ్చిందని చెబుతున్నారు.
ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్ర పోలీసులకు చట్ట పరిధి ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పినట్లుగా చెబుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. శాంతిభద్రతలకు సంబంధించి ఇరు రాష్ట్రాల పోలీసులను గవర్నర్ పర్యవేక్షించొచ్చని చెప్పినట్లుగా సమాచారం.
అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో.. ఓటుకు నోటు కేసు వ్యవహారం మొత్తంగా గవర్నర్కు దఖలు పడినట్లుగా చెప్పొచ్చు. అయితే.. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ చేతికి ఓటుకు నోటు కేసు వెళ్లటం.. ఈ వ్యవహారంలో కీలక మలుపుగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.