Begin typing your search above and press return to search.

కేరళ గోల్డ్ స్కామ్ లో స్వప్నా సురేషే విలనా?

By:  Tupaki Desk   |   21 July 2020 1:30 AM GMT
కేరళ గోల్డ్ స్కామ్ లో స్వప్నా సురేషే విలనా?
X
కేరళ సీఎం పినరయి విజయన్ సీఎంవో కార్యాలయంలో ‘గోల్డ్ స్కాం’ కలకలం రేపింది. సీఎంవోలో పనిచేస్తున్న ఐఏఎస్ కు దుబాయ్ నుంచి గోల్డ్ దిగుమతి స్కాంలో పాత్రధారి కావడం కేరళ సీఎంను ఇరుకునపెట్టింది. ఈ బంగారం స్కాంలో ప్రధాన సూత్రధారిగా స్వప్న సురేష్ కథ ఏకంగా కేంద్రం రంగంలోకి దిగేదాకా సాగింది.

కేరళ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐటీ సెక్రెటరీ ఎం. శివశంకర్ ను తొలగించడం రాజకీయ దుమారాన్ని రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ విమానంలో వచ్చిన యూఏఈ దేశ కాన్సులేట్ కార్యాలయానికి సంబంధించిన పార్సిల్స్ లో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగుచూసింది. యూఏఈ దేశ కాన్సులేట్ నకిలీ పత్రాలు ఉపయోగించి దౌత్యమార్గాల ద్వారా ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని తేలింది.

ఈ మొత్తం బంగారం అక్రమ రవాణాలో కీలక నిందితురాలుగా స్వప్నా సురేష్ మీద ఆరోపణలు వచ్చాయి. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన ఈ కేసులో సరిత్, స్వప్నా సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్ లను ‘ఎన్ఐఏ’ నిందితులుగా గుర్తించింది. స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కస్టడీలోకి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది.

స్వప్నా సురేష్ 2000లో దుబాయ్ నుంచి తిరువనంతపురం వచ్చి ట్రావెల్ ఏజెన్సీలలో పనిచేసింది. 10 ఏళ్లుగా బంగారాన్ని తీసుకెళ్లే పనిలో పరిచయాలు పెంచుకొని ఈ దందా సాగించినట్టు తేలింది.