Begin typing your search above and press return to search.

శోభనం గది నుంచి గాయలతో నవ వరుడు.. ఏమైంది?

By:  Tupaki Desk   |   25 March 2021 5:30 PM GMT
శోభనం గది నుంచి గాయలతో నవ వరుడు.. ఏమైంది?
X
ఫస్ట్ నైట్ అనగానే ఎవరికైనా ఆ ఊపు.. మజా ఎంజాయ్ వేరే లెవల్లో ఉంటుంది. తొలిరాత్రి కోసం కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తూ దాన్ని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకునే వారు ఎందరో.. అయితే ఆ శోభనం రాత్రి ఓ వరుడికి కాళరాత్రి అయ్యింది. వధువు చేసిన పనికి వరుడు గాయాలతో బయటకొచ్చాడు.

ఉత్తరప్రదేశ్ లోని కుందాకుర్డ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రోకర్ చూసిన సంబంధం చూసి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. మార్చి 15న పెళ్లి జరిగింది. మరుసటి రోజు కొత్త జంటకు శోభనం ఏర్పాటు చేశారు. వరుడు ఎన్నో కలలతో శోభనం గదిలోకి అడుగుపెట్టాడు.

ఏమైందో తెలియదు కానీ ఆ నవ వధువు అతడిపై ఇనుపరాడ్డుతో విచక్షణరహితంగా దాడి చేసింది. అనంతరం రూ.20వేల నగదు, రూ.2 లక్షల నగలతో ఇంటి నుంచి ఉడాయించింది. శోభనం గది నుంచి వరుడు తీవ్ర గాయాలతో బయటకు రావడంతో కుటుంబం షాక్ తిన్నది. వరుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరుడు కోలుకున్నాక మాట్లాడాడు.. ‘అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదని.. వధువు ఇనుపరాడ్డుతో నా పై దాడి చేయడంతో సొమ్మసిల్లి పడిపోయానని.. ఆ తర్వాత సృహలోకి వచ్చాక గది నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పానని వివరించాడు.

నవ వధువు పెళ్లయిన 5 గంటలకే నగలు, నగదుతో ఉడాయించిందని తెలిపాడు. డబ్బులు, నగల కోసం పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోందన్నాడు.