Begin typing your search above and press return to search.

ఊరట: ఏపీలో తగ్గిన కరోనా కేసులు

By:  Tupaki Desk   |   17 Aug 2020 9:32 PM IST
ఊరట: ఏపీలో తగ్గిన కరోనా కేసులు
X
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గింది. గతమూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోంది. తాజాగా ఏపీ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో ఆదివారంతో పోల్చితే కరోనా కేసులు తగ్గాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 44578 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 6780మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. అంటే దాదాపు 3 లక్షలకు కేసులు చేరువయ్యాయన్నమాట..

అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 82మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2732కు పెరిగింది.అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13మంది, తూర్పు గోదావరిలో 10మంది మరణించారు.

ఆదివారం 10117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 84777 యాక్టివ్ కేసులు ఏపీలో ఉన్నాయి.