Begin typing your search above and press return to search.

వైరల్: నరసాపురంలో కూడా కంగన

By:  Tupaki Desk   |   10 Sep 2020 5:32 PM GMT
వైరల్: నరసాపురంలో కూడా కంగన
X
ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది బాలీవుడ్ క్వీన్ కంగన రౌనతే. ఆమె ముంబై వెళ్లి మరీ శివసేన సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో బాలీవుడ్ మాఫియాను, శివసేన సర్కాన్ ను ఏకిపారేస్తోంది.

అయితే బాలీవుడ్ కంగనా తో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలుస్తూ నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. ముంబైని పీవోకేగా హాట్ కామెంట్స్ చేసి కంగన సంచలనం రేపారు. శివసేన సర్కార్ తో ఫైట్ చేస్తున్న కంగనను పోలుస్తూ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగన ఫొటోలను ఇప్పుడు నర్సాపురంలో తెగ పోస్టులు చేస్తూ నరసాపురంలో కూడా ఓ కంగన ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి నరసాపురం కంగనా అంటూ కామెంట్స్ హోరెత్తుతున్నాయి. కంగనా సుశాంత్ మరణంపై పోరాడుతోందని.. రఘురామ సొంత పార్టీ, సీఎం జగన్ పై పోరాడుతున్నారంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.

ఇప్పుడు రఘురామకృష్ణం రాజును నరసాపురం కంగన అనే ట్రోలింగ్ మొదలుపెట్టారు. వైసీపీని ఢీకొంటున్న ఈయనను ఫైర్ బ్రాండ్ అంటూ ఆయన ఫ్యాన్స్ కొందరు వ్యతిరేకులు సైతం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

కానీ కంగనా అందరినీ ఎదురించి ముంబైకి డేరింగ్ కాగా.. రఘురామ మాత్రం వైసీపీపై విమర్శలతో ఢిల్లీకే పరిమితం అయ్యారు. తన నియోజకవర్గంలోనూ తిరగలేని పరిస్థితిని కొనితెచ్చుకున్నారు.