Begin typing your search above and press return to search.

బీజేపీలోకి బోస్ మ‌న‌మ‌డు!

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:05 AM GMT
బీజేపీలోకి బోస్ మ‌న‌మ‌డు!
X
మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ కుటుంబానికి చెందిన వ్య‌క్తి ఒక‌రు బీజేపీలోకి చేరుతూ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడో సంచ‌ల‌నంగా మారింది. తాజాగా సుభాష్ చంద్ర‌బోస్ కుటుంబానికి చెందిన చంద్ర‌కుమార్ బోస్ బీజేపీలో చేరారు. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో ప్ర‌ముఖ కుటుంబాల్లో ఒక‌టైన బోస్ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి బీజేపీలోకి చేర‌టం బెంగాల్ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు.

బోస్‌కు చెందిన ప‌లు ర‌హ‌స్య ప‌త్రాల్ని ప్ర‌ధాని మోడీ ఆవిష్క‌రించిన వెంట‌నే బోస్ మ‌న‌మ‌డు బీజేపీలో చేర‌టం గ‌మ‌నార్హం. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో కాషాయ కుండ‌వ భుజాన వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బోస్ మ‌న‌మ‌డు మాట్లాడుతూ.. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చిట్ ఫండ్ ప‌రిశ్ర‌మ మాత్ర‌మే వృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం బెంగాలీ రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతుందో చూడాలి.