Begin typing your search above and press return to search.

ఏపీలో కాంగ్రెస్‌ సచ్చిపోతోంది

By:  Tupaki Desk   |   18 March 2015 5:00 AM GMT
ఏపీలో కాంగ్రెస్‌ సచ్చిపోతోంది
X
విభజన పుణ్యమా అని సీమాంధ్రలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలున్నారు. ఏంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారు.. పార్టీ కారణంగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న వారు.. ఇప్పటికీ కాంగ్రెస్‌ను వీడలేక కొనసాగుతున్నారు.

పార్టీకి అత్యంత విధేయులైన నేతల్లో ఇప్పటికే చాలామంది వేరే పార్టీలకు వెళ్లిపోవటం తెలిసిందే. మిగిలిన కొద్దిమంది సైతం ఇప్పుడు పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీకి అత్యంత విధేయులైన నేదురుమల్లి ఫ్యామిలీ ఇప్పుడు కాషాయ పార్టీలోకి చేరేందుకు సిద్ధం కావటం కలకలం రేపుతోంది.

విభజనతో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌కు.. తాజా పరిణామం కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అంటే నేదురుమల్లి.. నేదురుమల్లి అంటే కాంగ్రెస్‌ అన్నట్లుగా ఉండే కుటుంబం సైతం ఈ రోజున పార్టీ మారేందుకు సిద్ధమవుతుండటం చూస్తుంటే.. పాతికేళ్లకు కూడా పార్టీ కోలుకోవటం కష్టమంటున్నారు.

దివంగత నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో మారే విషయంపై బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడితో మాట్లాడారని.. ఆయన కూడా ఓకే చెప్పేశారంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి రామ్‌కుమార్‌ వెళ్లిపోవటం.. కాంగ్రెస్‌కు తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.